ఏపీ: కార్యకర్తలతో శభాష్ అనిపించుకుంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్..!
ఏపీలోని రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నట్లుగా కాకినాడ పోర్టుని కూడా ద్వారంపూడి కుటుంబం కబ్జా చేసిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన ఒక సమగ్ర నివేదికను కూడా తయారు చేసి సిఐడి కి అప్పగించామంటూ ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఇప్పుడు ఈ విషయం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నది. కాకినాడ జిల్లాలో గత రెండు రోజులుగా తనిఖీలు సైతం ఎక్కువగా నిర్వహిస్తూ ఉన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్..
ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ మొత్తం ఎనిమిది గోడౌన్లలో పేదలకు సరఫరా చేస్తున్న బియ్యం ఉన్నట్లుగా దొరికాయంటూ తెలిపారు. ఈ క్రమంలోనే సుమారుగా 13 ,000 టన్నుల బియ్యం నిలువను సీజ్ చేశామంటూ తెలియజేశారు..ఈ గోడౌన్ లో ఉన్నటువంటి బియ్యం ఎవరు నిల్వ చేశారు. అన్న విషయం పైన తెలియదు అని చెబితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ క్రమంలోనే ఈ పట్టుబడిన బియ్యం గురించి ప్రశ్నించగా తమిళనాడు పౌరసరఫరా శాఖకు పంపబోతున్నట్లు చెబుతున్నారని తెలిపారనీ చెప్పారు నాదెండ్ల మనోహర్.. కానీ ఈ బియ్యం దారి మళ్లించబోతున్నట్లుగా తెలిసిందని ఈ విషయం పైన ఎవరిని ఉపేక్షించేది లేదంటే తెలిపారు. అయితే నాదెండ్ల మనోహర్ తనకు వచ్చిన మంత్రి శాఖ నుంచి గత కొన్ని రోజులుగా పర్యటనలు చేస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్లడంతో జనసేన కార్యకర్తలు సైతం మెచ్చుకుంటున్నారు.