ఇప్పటికీ మారని జగన్.. మళ్ళీ వారికే ప్రాధాన్యత..!!
*మళ్ళీ వారికే పార్టీలో ప్రాధాన్యతను ఇస్తున్న జగన్
*ఇప్పటికీ మారకుంటే ఈ సారి కూడా కష్టమే అంటున్న రాజకీయ విశ్లేషకులు
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తిరుగులేని విజయం సాధించింది.ఏకంగా 164 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈ సారి కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు పొంది అన్నింటిని గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాడు అంతే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా భాద్యతలు స్వీకరించారు. అయితే గత ఎన్నికలలో 151 సీట్లు సాధించిన వైసీపీ పార్టీ ఈ సారి కేవలం 11 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది. గత వైసీపీ కాబినెట్ లో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తప్ప మిగిలిన మంత్రులందరు దారుణంగా ఓడిపోయారు.రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. వైసీపీ హయాంలో మంత్రులను జగన్ కేవలం ప్రతిపక్ష నేతలను తిట్టేందుకే పెట్టుకున్నట్లు వారు వ్యవహారించారు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ సీనియర్ నాయకులకు గాని, కార్యకర్తలకు గాని అంతగా గుర్తింపు లభించలేదు.