పవన్: వారికీ మాస్ వార్నింగ్.. ఏం జరిగిందంటే..?
మాట్లాడితే కొట్టే వారి దగ్గరే భయంగా ఉంటారని ప్రేమగా మాట్లాడితే కచ్చితంగా చులకన చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు.. తనకు భయమే లేదని తనతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించారు. మర్యాదపూర్వకంగా మాట్లాడితే వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని నియమాలు ప్రోటోకాల్స్ వంటివి పాటిస్తున్నానని అలుసుగా తీసుకుంటే మాత్రం అసలు సహించేదే లేదని తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఎవరైనా గెలిచాము కదా అని తల ఎగిరేయొద్దు అంటూ తెలియజేశారు.
వైసీపీకి 11 సీట్లు వచ్చిన ఒక్కటి సీటు వచ్చిన వారిపైన దాడులు దిగడం సరైన పద్ధతి కాదంటూ కూడా తెలిపారు.. వైసీపీకి 151యొక్క సీట్లు ఇచ్చి కాలం పరీక్ష పెట్టిందని వారు ఆ పరీక్షలు ఓడిపోయారు అంటూ అది గుణపాఠంగా తీసుకోవాలి అంటూ తెలిపారు. తనకు వ్యక్తిగత కక్షలు అసలు లేవని తప్పు చేసిన వారిని చట్టమే శిక్షిస్తుంది అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్. జనసేనకు వైసీపీకి తేడా ఇదే అని కూడా తెలిపారు జనసైనికులు క్రమశిక్షణగా ఉండాలని తెలియజేశారు తనకు తిట్టడానికి కూడా సమయం లేదని చాలా పని ఉంది అంటూ తెలియజేసి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు పాటిస్తారో లేదో చూడాలి.