రామచంద్రయ్య, హరిప్రసాద్.. పవన్, బాబు ఇద్దరు మిస్టేక్ చేశారా..
ఆ మాటకు వస్తే ఆయన గతంలో టీడీపీ వాడే టీడీపీ తోనే రామచంద్రయ్య రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఇక మహమ్మద్ ఇక్బాల్ మైనార్టీ నేత ఆయన తన ఎమ్మెల్సీ పదవి వదులుకొని టీడీపీలోకి వచ్చిన ఆయనకు మరోసారి పదవి ఇవ్వలేదు. అనూహ్యంగా రెండో ఎమ్మెల్సీ స్థానాన్ని చంద్రబాబు జనసేనకు కేటాయించారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడే చంద్రబాబు, పవన్ ఇద్దరు తప్పు చేశారన్న చర్చలు కూడా రాజకీయ వర్గాలు జరుగుతున్నాయి.
అటు సీ. రామచంద్రయ్య , ఇటు హరిప్రసాద్ ఇద్దరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావటం.. ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులను ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అసంతృప్తి కారణం అవుతుంది. ఒకటి కాపులకు ఇచ్చినప్పుడు.. రెండో ఎమ్మెల్సీ స్థానాన్ని కనీసం బీసీలలో ఎవరికి అయిన ఇచ్చి ఉంటే బాగుండేదంటున్నారు. అనూహ్యంగా ఇటు చంద్రబాబు, అటు పవన్ ఇద్దరు కూడా తమ పార్టీల నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలనే ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారని.. ఇది ఎంతవరకు కరెక్ట్ ? అన్న చర్చలు రెండు పార్టీల నేతలలోనూ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పైకి ఎవరూ చెప్పకపోయినా లోపల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్నది వాస్తవం.