పవన్ కళ్యాణ్ ఎంట్రీ తో.. 9 నెలల తర్వాత వీడిన మిస్టరీ..!
అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవలే పవన్ కళ్యాణ్ భీమవరం పట్టణానికి వెళ్లడం జరిగింది.దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భీమవరం పట్టణానికి చెందినటువంటి శివకుమారి తన కూతురు కనిపించడం లేదనే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా సిఐతో ఫోన్లో మాట్లాడి రంగంలోకి పోలీసులను సైతం పంపించడం జరిగింది. వాస్తవానికి 9 నెలలుగా అమ్మాయి కనిపించలేదని పోలీస్ కేసు పెట్టినప్పటికీ పోలీసులు విచారణ చేస్తున్న అది ముందుకు సాగడం లేదట.
ఈ విషయం విన్న తల్లిదండ్రులు చాలా కృంగిపోయి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడంతో.. ఈ కేసుని కేవలం కొన్ని గంటలలోనే పోలీసు అధికారులు చేదించినట్లుగా తెలుస్తోంది.అలా మిస్సింగ్ అయిన అమ్మాయి రాయవరప్పాడుకు చెందిన యువకుడితో ఆమె జమ్ములో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు సైతం ఆ జంటని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం విన్న వెంటనే అటు కుటుంబ సభ్యుల సైతం ఆనందాన్ని తెలియజేయగా పవన్ కళ్యాణ్ అభిమానులు ,జనసేన కార్యకర్తలు సైతం ఆనందానికి అవధులు లేవు 9 నెలలుగా కానీ పని కేవలం ఒక్క రోజులోనే మా అధినేత చేసి చూపించారనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి అంటే జనసేన నేతలు కార్యకర్తలు తెలుపుతున్నారు.