ఈ సారి అలాంటి తప్పులకు తావులేకుండా చంద్రబాబు పాలన..?
*గ్రౌండ్ లెవెల్ పనులపై ప్రత్యేక దృష్టి
* ఈసారి ఎలాంటి పొరపాటు జరగకుండా ముందస్తు జాగ్రత్త
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తిరుగులేని విజయం సాధించింది.ఏకంగా 164 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈ సారి కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు పొంది అన్నింటిని గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాడు అంతే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా భాద్యతలు స్వీకరించారు. అయితే గత ఎన్నికలలో 151 సీట్లు సాధించిన వైసీపీ పార్టీ ఈసారి కేవలం 11 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది.నాలుగోసారి ముఖ్య మంత్రిగా భాద్యతలు స్వీకరించిన చంద్రబాబు మొదటి రోజు నుంచే పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ వస్తున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 22 రోజులలో చంద్రబాబు ఎంతో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.