చేతెలెత్తేసిన జగన్... అఖరి ఆస్త్రం కూడా అట్టర్ ప్లాప్..?
రాష్ట్రంలో పార్టీ పరిస్థితి తో పాటు భవిష్యత్తులో పార్టీని ఎలా నిలబెట్టాలి ? అనే కార్యచరణ పై జగన్మోహన్ రెడ్డి వారితో చర్చించారు. మండలి లో వైసీపీకి ఎక్కువ బలం ఉన్న నేపథ్యంలో అధికార పార్టీని అన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టాలని జగన్ చేసిన సూచనలను కొంతమంది ఎమ్మెల్సీలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కాదు కూడదు అని జగన్ వారిని బెదిరించాలని చూసినా.. తాను చెప్పినట్టు వినాలని ఒత్తిడి చేసిన వారిలో చాలామంది పార్టీ వీడి టిడిపిలోకి వెళ్లేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వైసిపి ఎమ్మెల్సీలు ఇప్పుడు ఎవరెవరు పార్టీ వీడతారు అనేది చర్చ నీయాంశంగా మారింది.
ఏది ఏమైనా కనీసం మండలి లో అయినా ప్రభుత్వాన్ని అడ్డు కట్ట వేయాలని జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించేలా లేవు. చివరకు సొంత పార్టీ వాళ్లు సైతం జగన్ మాట వినే పరిస్థితి లేదని అర్థమవుతోంది. మరి ఈ ఐదేళ్లు జగన్ ఎలా పార్టీని ముందుకు నడుపుతారో ? చూడాలి.