బైక్స్ నడిపే యూత్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ?
చాలామంది ఆటోల వెనుక.. బండ్ల నెంబర్ ప్లేట్ల పైన... పిఠాపురం వారి తాలూకు అంటూ రాసుకుం టున్నారు. కొంతమంది కార్ల అద్దాలపై కూడా రాసుకుంటున్నారు. అయితే పిఠాపురం లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్... ఇదే అంశాన్ని తెరపైకి తీసు కువచ్చారు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా పిఠాపురం గారి తాలూకా అంటూ రాసుకోవడం నేరమని... ఆ పేర్లను తీసేసి నెంబర్ ప్లేట్ కనిపించేలా చూసు కోవాలని యూత్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
తన పేరు వల్ల... మీరు చిక్కుల్లో పడతారని... పోలీసులకు కూడా ఇబ్బంది జరుగుతుందని ఆయన వెల్లడిం చారు. కాబట్టి ఇక పైన ఇలాంటి రాతలు రాయకుండా... నెంబర్ ప్లేట్లు కనిపించేలా చూసుకోవాలని.. కోరారు. ఇక దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో అక్కడ ఉన్న యూత్ అలాగే ప్రజలు దద్దరిల్లి పోయేలా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే తాము ఫాలో అవుతామని యూత్ చెపుతున్నారు.