వైసీపీలో హాట్టాపిక్గా రాజమాత... ఎవరామె... ఆమె పార్టీని ముంచిందన్న చర్చా..?
వెంటనే మాజీమంత్రి నాదేం లేదు.. అంతా మీ వల్ల వల్లే జరిగిందని చెప్పగా.. ఆ మాజీ ఎమ్మెల్యే అసలు ఆమెను రాజమాత అని మీరు ఎందుకు తిట్టారు..? అక్కడ నుంచే కదా మన పార్టీ సర్వనాశనం మొదలైందని ప్రశ్నించారట. వెంటనే మాజీ మంత్రి రాజమాత అంటే అదేమీ తిట్టు కాదు కదా.. మీ వాళ్ళ వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది అని వారిద్దరూ వాదులాడుకుంటూ ఉండగా వెంటనే జగన్ భద్రతా సిబ్బందిలో ఒకరు కలుగజేసుకుంటూ.. ఆ మాజీ మంత్రి ఉద్దేశించి సార్ మీ వల్లే పార్టీకి ఇబ్బంది మొదలైంది.. అందరూ కలిసి పార్టీని ముంచారు అని చెప్పడంతో అక్కడితో ఆ గొడవ సర్దుమణిగిందట.
ఇంతకు రాజమాత అంటే ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఒక మహిళ నాయకురాలును ఉద్దేశించి అన్నట్టు బయటికి వచ్చింది. ఇంతకు ఎవరా రాజమాత..? అని ప్రశ్నించుకుంటే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ వైసీపీ నాయకురాలు ప్రస్తుతం టీడీపీ నుంచి కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరి.. ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అయితే వైసీపీని వీడిన ప్రశాంతి రెడ్డిని ఆ పార్టీ నేతలు పదేపదే రాజమాత అని సెటైరికల్ గా కౌంటర్లు వేశారు. వాస్తవంగా వేమిరెడ్డి దంపతులకు నెల్లూరు జిల్లాలో మంచి పేరు ఉంది. అందుకే వారిద్దరు విజయం సాధించడంతోపాటు.. టోటల్ జిల్లా మొత్తం మీద వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేశారన్న ప్రచారం కూడా ఉంది.