జగన్ చుట్టూ కోవర్టులు... ఎవ్వరిని నమ్మట్లేదా ?
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓవరాక్షన్ చేసిన వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. ఎవరికి వాళ్లకు ఈ ఐదేళ్లలో ఫ్యూచర్ ఎలా ?ఉండబోతుందో..? 20 రోజుల టీజర్ చెప్పకనే చెప్పేసింది. అందుకే వైసీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్సీలు జిల్లాల్లో టీడీపీకి చెందిన నేతలతో చెట్టాపట్టలేసుకుని తిరుగుతున్నారట. వైసీపీ ఎమ్మెల్సీల బాధ వాళ్లకు ఉంది. దీంతో వైసీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఈ విషయాన్ని పార్టీ అధినేత జగన్ చెవిలో వేశారట. జగన్ సైతం ఈ విషయంలో నిస్సహాయత వ్యక్తం చేయడంతో పాటు.. తాను ఏం ? చేయగలనని తిరిగి ప్రశ్నించారట.
అధికారంలో ఉన్నప్పుడు బుజ్జగిస్తేనే ఐదుగురు ఎమ్మెల్సీలు పోయారు. ఇప్పుడు అధికారం లేకుంటే ఎవరు ? మాత్రం ఉంటారని జగన్ తిరిగి ప్రశ్నించినట్టు తెలిసింది. ఓవైపు జగన్ మంత్రి మండలిలో వైసీపీకి మెజార్టీ ఉంది. ప్రభుత్వాన్ని అక్కడ ఇరుకున పెడదామని ప్లాన్లు వేస్తుంటే వాళ్లు మాత్రం టీడీపీతో అంట కాగుతూ తిరిగి జగన్ దగ్గరికి కూడా వెళుతున్నారు. దీంతో వైసీపీ అధినాయకత్వం తన చుట్టూ ఉన్న కొందరి వైసీపీ ఎమ్మెల్సీలు, టీడీపీకి కోవర్ట్లుగా పనిచేస్తున్నారని.. అలాంటివారు ఎవరో ? గుర్తించే పనిలో ఉందట. ఒకవేళ జగన్ ఎవరిని అయినా బెదిరించినా టీడీపీ వాళ్లతో సన్నిహితంగా ఉండవద్దని చెప్పినా ఎవరు ఆగే పరిస్థితి లేదు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం చాలామంది అవసరం అయితే పార్టీని వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.