జగన్ కొంప ముంచుతున్న వైసీపీ ఫ్యాన్స్ ?
ప్రస్తుతం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు గురువారం రోజున ప్రత్యేక హెలికాప్టర్ లో...హుటాహుటిన జగన్ మోహన్ రెడ్డి బయలుదేరారు. ఈ మేరకు నెల్లూరులో ఉన్న... కనపర్తిపాడు జడ్పీ హైస్కూల్ ఆవరణలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన తెలిపాడ్ ను ఏర్పాటు చేశారు వైసిపి నేతలు.
సాధారణంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో.. ఎవరైనా ఆయనను చూసేందుకు ఎగబడతారు. అయితే నెల్లూరుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో.... ఆయన ఫ్యాన్స్ ఎగబడి చూసేందుకు వచ్చారు. హెలిప్యాడ్ వద్దకు కూడా చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత కూడా నెలకొంది. అయితే దీన్ని సాక్షి పేపర్ అలాగే, వైసిపి కి సంబంధించిన మీడియా సంస్థలు... జగన్మోహన్ రెడ్డి పర్యటన ను అడ్డుకునేందుకు... చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ప్రచారం చేసింది.
జనాలు అంతలా ఎగబడి చూసేందుకు వస్తే... భద్రత సిబ్బందిని ఏర్పాటు చేయలేదని... ఇది కావాలనే టిడిపి చేసిందని వైసిపి చెబుతోంది. అయితే జగన్ చూసేందుకు జనాలు వస్తే... ఆంక్షలు విధిస్తే తప్పు కానీ... ఇలా భద్రత ఏర్పాటు చేయలేదని చెప్పడం చాలా తప్పిదం. వైసిపి పార్టీకి... పెద్ద మైనస్ అవుతుంది. అలాంటి చిన్న మిస్టేక్ కూడా ఇప్పుడు వైసీపీ చేయడం... దారుణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ కోసం అభిమానులు వస్తే... ఆయన క్రేజ్ పెరుగుతుంది కానీ... చంద్రబాబుపై ఇలా బురద జల్లితే... వైసీపీకి అంటుకుంటుందని చెబుతున్నారు. ఇకనైనా.. తెలివిగా ముందుకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు.