అభివృద్ధిపై గురిపెట్టిన గురుశిష్యులు.. రాష్ట్రాల దిశ మారుస్తారా.?
-అలనాడు గురు శిష్యులు..
-ప్రజెంట్ ఇరు రాష్ట్రాల సీఎంలు..
- ఒకే జెండా కింద ఎదిగిన వీరు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తారా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు సీఎంగా కేసీఆర్ గద్దెనెక్కారు. ఈ సమయంలో ఆయన ఎన్నో పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాష్ట్రానికి సంబంధించిన వాటాలు ఏపీతో ఉన్నటువంటి సంబంధాలు ఏవి కూడా ఏనాడు మాట్లాడలేదు. ఈయన మొదటిసారి తెలంగాణకు సీఎం అయిన సమయంలో 2014లో అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. కానీ వీరి మధ్య ఏనాడు కూడా సఖ్యత సరిగ్గా కుదరలేదు. ఆ తర్వాత 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం జరిగింది. అయినా కేసీఆర్ రెండవ సారి ఇక్కడ గద్దెనెక్కి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రస్తావన చేయలేదు. కానీ 2023 ఎలక్షన్స్ వచ్చేసరికి తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయి రేవంత్ సర్కార్ గద్దెనెక్కింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు గురు శిష్యులే సీఎంలు అయ్యారు. మరి ఈ ఇద్దరు సీఎంల పరిపాలన లో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయా.. వీరిద్దరి మధ్య సంబంధం ఎలా ఉండబోతోంది అనే వివరాలు చూద్దాం..
చంద్రబాబు రేవంత్ ప్రయాణం:
2007లో సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా స్వతంత్ర ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి టీడీపీలో చేరిపోయాడు. అలా 2009లో కోడంగల్ నియోజకవర్గం లో టిడిపి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలా టిడిపి హయాంలో ఎమ్మెల్యేగా ఆయన మంచి గుర్తింపు పొందారు. అప్పటినుంచి సీఎం రేవంత్ రెడ్డి మధ్య మరియు చంద్రబాబు మధ్య సత్ససంబంధాలు కొనసాగాయి. ఇక 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2017తెలంగాణ అసెంబ్లీలో కూడా పనిచేశారు. అలా ఉన్న తరుణంలోనే 2018లో ఆయన టిడిపి పార్టీ నుంచి బయటకు వచ్చి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. అలా చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డి మధ్య 17 సంవత్సరాల బంధం ఉంది.