ఏపీ: మాజీ సీఎం జగన్ పై కాంగ్రెస్ సంచలన ప్రకటన..!

Divya
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ గా విడగొట్టడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయింది. అయితే 2023 లో జరిగిన ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి విజయాన్ని అందుకుంది.కానీ ఆంధ్రాలో మాత్రం పెద్దగా పట్టు సంపాదించుకోలేకపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి నాడు జరిగిన ప్రయత్నమే రాష్ట్ర విభజనకు కీలకమైనటువంటి కారణమని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమాన్ని 2009 తర్వాత చల్లార్చాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్నది. ఎందుకంటే ఒక ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని భావించిందట.

వీటితోపాటు అక్కడున్న వారందరికీ కీలకమైన పదవులు ఇచ్చి చేద్దామనుకుండట కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆపివేయడం జరిగిందట. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వద్దు మళ్ళీ చూద్దామని చెప్పారట. ఆ సమయంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పీకల మీది వరకు వచ్చిందట. రాష్ట్ర విభజన జరిగితే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న తెలంగాణ ప్రాంతం విడిపోతే జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ ఉండదని కాంగ్రెస్ పార్టీ భావించిందట. ఇది కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కేకే, వి విస్ లాంటి వాళ్లు చెప్పినటువంటి మాటలు.

అప్పుడు కాపులకు అవకాశం వస్తుంది తమకు అవకాశం వస్తుందని లేకపోతే రెడ్లకు వచ్చినా కూడా తమకే వస్తుందనే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పేవారట. జగన్ని దెబ్బ కొట్టడం కోసమే తెలంగాణ విభజనని చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు తాజాగా చింతామొహన్ సీనియర్ మోస్ట్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో తిరుపతిలో ఈసారి పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు వరుసగా గెలిచారట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించడానికి ముఖ్య కారకులు సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కారకులు అంటూ తెలిపారుట. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ఈ విభజన జరిగేది కాదని తెలిపారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: