రాజకీయంగా గొడవలు.. కుటుంబంలో చీలికలు..జగన్ కు జరిగిందో కెసిఆర్ కు జరుగుతుందా..?
* కెసిఆర్ ఇలాకాలో సరికొత్త సమస్య
* సొంతవారే కయ్యానికి కాలు దువ్వుతున్నారా ?
ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలలో ఏకంగా 151 సీట్లు సాధించి చరిత్ర సృష్టించిన జగన్ ఈ సారి ఎన్నికలలో కేవలం 11 సీట్లే సాధించి ప్రతిపక్ష హోదా కోల్పాయారు.అయితే జగన్ ఓడిపోవడానికి కూటమి ఒక కారణం అయితే కుటంబం లో చీలిక మరొక కారణంగా చెప్పవచ్చు.తన సొంత చెల్లెలు అయిన షర్మిల కాంగ్రెస్ లో చేరి జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసింది.కాంగ్రెస్ పీసిసి అధ్యక్షురాలిగా ఎన్నికైన షర్మిల జగన్ ను ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తుంది.ఈ ఎన్నికలలో జగన్ ను దెబ్బ తీసిన మరో సమస్య బాబాయ్ హత్య ..తన సొంత బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందారోపణలు వున్న అవినాష్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇవ్వడంతో వివేకా హత్యపై న్యాయ పోరాటం చేస్తున్న జగన్ మరో చెల్లెలు సునీత షర్మిలకు మద్దతు తెలిపింది.దీనితో ఇద్దరు చెల్లెల్లు జగన్ పై విమర్శనాస్త్రాలు కురిపించారు.