కేటీఆర్ Vs సత్యకుమార్.. గొడవ వెనక అసలు స్టోరీ ఇదా..?
- భూబకాసురుడు కేతిరెడ్డి అని సత్యకుమార్ ధ్వజం
- వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులంటూ బండి సంజయ్ సపోర్ట్
( రాయలసీమ - ఇండియా హెరాల్డ్ )
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వర్సెస్ ఏపీ మంత్రి సత్యకుమార్ మధ్య రాజకీయ వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య ఎందుకింత రాజకీయ రగడ చోటుచేసుకుంది? అనేది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఆసక్తికర చర్చ. రెండు రోజుల కిందట తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన విషయంపై స్పందించారు. తామస్సలు ఊహించలేదని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని ఎవరు కలగనలేదని చెప్పుకొచ్చారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మరీ ప్రజలకు ఇచ్చారని తెలిపారు.
అయినా ఆయన ఓడిపోయారని, ఇది ఎవరికి అంతుచిక్కలేదని వ్యాఖ్యానించారు. ఇక మరో విషయం.. ధర్మవరం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో తన మిత్రుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓడిపోవడం కూడా అసలు ఊహించని పరిణామంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేతిరెడ్డి తన మిత్రుడని, గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రతిరోజు ఉదయం ఆయన ప్రజలకు చేరువయ్యే వారిని, అటువంటి నాయకుడు కూడా ఓడిపోవడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వె- ఈవీఎంలను మేనేజ్ చేశారన్న కోణంలో కేటీఆర్ ఆరోపణా ?
- భూబకాసురుడు కేతిరెడ్డి అని సత్యకుమార్ ధ్వజం
- వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులంటూ బండి సంజయ్ సపోర్ట్
( రాయలసీమ - ఇండియా హెరాల్డ్ )
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వర్సెస్ ఏపీ మంత్రి సత్యకుమార్ మధ్య రాజకీయ వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య ఎందుకింత రాజకీయ రగడ చోటుచేసుకుంది? అనేది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఆసక్తికర చర్చ. రెండు రోజుల కిందట తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన విషయంపై స్పందించారు. తామస్సలు ఊహించలేదని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని ఎవరు కలగనలేదని చెప్పుకొచ్చారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మరీ ప్రజలకు ఇచ్చారని తెలిపారు.
అయినా ఆయన ఓడిపోయారని, ఇది ఎవరికి అంతుచిక్కలేదని వ్యాఖ్యానించారు. ఇక మరో విషయం.. ధర్మవరం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో తన మిత్రుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓడిపోవడం కూడా అసలు ఊహించని పరిణామంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేతిరెడ్డి తన మిత్రుడని, గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రతిరోజు ఉదయం ఆయన ప్రజలకు చేరువయ్యే వారిని, అటువంటి నాయకుడు కూడా ఓడిపోవడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఈవీఎంలను మేనేజ్ చేశారు అనే కోణం దాగి ఉందనేది రాజకీయ వర్గాల మాట. అయితే, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు నేపథ్యంలో టిడిపి నాయకులు గాని జనసేన పార్టీ నాయకులు గాని ఎవరూ స్పందించలేదు. ఈ క్రమంలో ధర్మవరం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నటు సత్య కుమార్ దీనిపై స్పందించారు. బిజెపి తరఫున తొలిసారి ప్రజాక్షేత్రంలో పోటీచేసిన సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గం నుంచి గెలిచిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన వైద్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ భూబకాసురుడు అని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని వ్యాఖ్యానించారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన ప్రజలను కలవలేదని, తన కాంట్రాక్టర్లను, దోపిడీదారులను కలుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటిని చూసి మధ్యాహ్నానికల్లా వాటిని కొట్టేసే ప్లాన్ చేశారని విమర్శించారు. అంతేకాదు కేటీఆర్ ను సైతం వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. తెలంగాణలో ధరణి పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకం అక్కడ భూ కుంభకోణాలకు భూ కబ్జాలకు దారితీసిందని చెప్పారు.
అట్లాగే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా భూములు దోచుకున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ఒకసారిగా ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేగింది. అయితే ఈ విషయంలో టిడిపి కానీ జనసేన కానీ ఎక్కడా జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. అటు కేటీఆర్ ఇటు బిజెపి నాయకుడు సత్య కుమార్ మాత్రమే ఈ వివాదానికి పరిమితమయ్యారు. ఇంతలో ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి నాయకుడు బండి సంజయ్ మరో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గత వైసిపి పాలనను ఆయన ఎండగట్టారు .
ఏపీలో గత వైసిపి పాలకులు వీరప్పన్ వారసులంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను చూస్తే సత్య కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ బిజెపి నాయకుడు బండి సంజయ్ మద్దతు ఇచ్చినట్టుగా గమనించాలి. ఏపీలో ఏ నాయకుడు స్పందించకపోయినా బండి సంజయ్ తిరుమల వచ్చి సత్య కుమార్ యాదవ్ పేరుని ప్రస్తావించకపోయినా వైసీపీ ప్రభుత్వాన్ని వీరప్పన్ వారసులంటూ వ్యాఖ్యానించటం భూకబ్జాలు చేశారని చెప్పడం ద్వారా కేటీఆర్ కు ఆయన కూడా చెక్ పెట్టినట్లు అయింది. మొత్తంగా చూస్తే ఈ వివాదం చిలికి చిలికి గాలివాన అవుతుందా? లేకపోతే ఇక్కడతో ఆగుతుందా అనేది చూడాలి.నుక ఈవీఎంలను మేనేజ్ చేశారు అనే కోణం దాగి ఉందనేది రాజకీయ వర్గాల మాట. అయితే, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు నేపథ్యంలో టిడిపి నాయకులు గాని జనసేన పార్టీ నాయకులు గాని ఎవరూ స్పందించలేదు. ఈ క్రమంలో ధర్మవరం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నటు సత్య కుమార్ దీనిపై స్పందించారు. బిజెపి తరఫున తొలిసారి ప్రజాక్షేత్రంలో పోటీచేసిన సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గం నుంచి గెలిచిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన వైద్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ భూబకాసురుడు అని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని వ్యాఖ్యానించారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన ప్రజలను కలవలేదని, తన కాంట్రాక్టర్లను, దోపిడీదారులను కలుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటిని చూసి మధ్యాహ్నానికల్లా వాటిని కొట్టేసే ప్లాన్ చేశారని విమర్శించారు. అంతేకాదు కేటీఆర్ ను సైతం వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. తెలంగాణలో ధరణి పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకం అక్కడ భూ కుంభకోణాలకు భూ కబ్జాలకు దారితీసిందని చెప్పారు.
అట్లాగే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా భూములు దోచుకున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ఒకసారిగా ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేగింది. అయితే ఈ విషయంలో టిడిపి కానీ జనసేన కానీ ఎక్కడా జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. అటు కేటీఆర్ ఇటు బిజెపి నాయకుడు సత్య కుమార్ మాత్రమే ఈ వివాదానికి పరిమితమయ్యారు. ఇంతలో ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి నాయకుడు బండి సంజయ్ మరో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గత వైసిపి పాలనను ఆయన ఎండగట్టారు .
ఏపీలో గత వైసిపి పాలకులు వీరప్పన్ వారసులంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను చూస్తే సత్య కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ బిజెపి నాయకుడు బండి సంజయ్ మద్దతు ఇచ్చినట్టుగా గమనించాలి. ఏపీలో ఏ నాయకుడు స్పందించకపోయినా బండి సంజయ్ తిరుమల వచ్చి సత్య కుమార్ యాదవ్ పేరుని ప్రస్తావించకపోయినా వైసీపీ ప్రభుత్వాన్ని వీరప్పన్ వారసులంటూ వ్యాఖ్యానించటం భూకబ్జాలు చేశారని చెప్పడం ద్వారా కేటీఆర్ కు ఆయన కూడా చెక్ పెట్టినట్లు అయింది. మొత్తంగా చూస్తే ఈ వివాదం చిలికి చిలికి గాలివాన అవుతుందా? లేకపోతే ఇక్కడతో ఆగుతుందా అనేది చూడాలి.