ఏపీ: పార్టీ కోసం అలాంటి పని చేయబోతున్న పవన్..!
ప్రతి నియోజకవర్గంలో నుండి 50 మందికి లాగిన్ ఐడీలు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల జనసేన కేవలం 6 లక్షల 47 వేల మంది సభ్యులు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి సభ్యుల సంఖ్య 9 లక్షలకు పైగా పెంచాలని టార్గెట్ తో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాకుండా పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలలో తమ పేరుని ఎక్కువగా వినిపించేలా చేయాలని ఆలోచనతో జనసేన పార్టీ ఆ వైపుగా అడుగులు వేస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో సభ్యత నమోదును సైతం చేపట్టాలని పవన్ కళ్యాణ్ కూడా తమ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పది రోజులపాటు సభ్యత నమోదు కార్యక్రమాలు జరుగుతాయని ఇందుకోసం పార్టీ యంత్రాంగం మొత్తం కూడా కదలి రావాలి అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.. పార్టీ పెట్టి ఇప్పటికి ఎన్నో ఏళ్ళు అయిన 2024 ఎన్నికలలో కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ తో పాటు తమ పార్టీ నేతలు నిలబడిన ప్రతిచోట కూడా భారీ ఘనవిజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూటమిలో భాగంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్..