ఏపీ: మహిళ అధికారితో సంబంధం పై.. విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Divya
మహిళ అధికారితో వైసీపీ నేత విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటూ గత రెండు మూడు రోజుల నుంచి రకాల న్యూస్ పేపర్లలో , న్యూస్ చానల్స్ లో పలువురు నేతలు కూడా చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. కానీ ఆ మహిళ అధికారి శాంతి కూడా ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయ్యారు. ఇలాంటి సమయంలోనే వైసిపి నేత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు పాటుపడుతోంది అంటూ వైసిపి నేతలపైన దాడులు చేస్తోంది కూటమి ప్రభుత్వం రాక్షస పాలన అంటూ కూడా ఎద్దేవ చేశారు.

కేవలం తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి పన్నాగాలు కూటమి ప్రభుత్వం పడుతుంది అంటూ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చేశారు.మభ్యంతర ఎన్నికలు వచ్చినా, ఐదేళ్లకు ఎన్నికలు వచ్చినా కూడా వైసీపీ పార్టీ గెలుస్తుంది అంటూ ధీమాని తెలియజేశారు.. ఒక ఆదివాసి మహిళకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని కూడా ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి. బాధ్యతయుతమైన ఎంపీగా తాను పనిచేస్తూ ఉంటే ఒక ఆదివాసి మహిళతో తనకి సంబంధం ఉన్నట్లు ఇలాంటి ప్రచారం చేసే వారి పైన కూడా ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటానని తెలియజేశారు.

అలాగే తన ప్రతిష్టను భంగం కలిగించేలా చేసిన మీడియా సంస్థలను కూడా వదిలిపెట్టను అంటూ అలాగే యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లను కూడా తనపైన తప్పుడుగా ప్రచారం చేశారు..వారిని కూడా వదలను అంటూ తెలిపారు. కొందరు బరితేగించి మరి తనపైన ఇలాంటి ఆరోపణలు చేశారని తన పైన కుట్ర చేసిన వారందరికీ త్వరలోనే బుద్ధి చెబుతానని కూడా తెలిపారు. అలాగే పరువు నష్టం దావా కూడా వేస్తారని విధినిర్వహణలో తనను చాలా మంది ప్రజలు ఆఫీసర్లు కలుస్తూ ఉంటారని ఆమాత్రణ సంబంధం అంటగడతారా అంటూ కూడా ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం అటుకూటమి నేతలను ఆందోళన కలిగించేలా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: