తెలుగు ప్రజలు.. తెలుగు మీడియా అక్రమ సంబంధాలు..?
అటు రాజ్ తరుణ్, ఇటు లావణ్య ఇద్దరిని పెట్టి ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ల గురించి రకరకాల వీడియోలు వదులుతూ నానా రచ్చ చేస్తుంది. లావణ్య చౌదరి బయటికి వచ్చాక రాజ్ తరుణ్కు కొందరు హీరోయిన్లతో అక్రమ సంబంధాలు అంటూ చెబుతున్నారు. అలాగే లావణ్యకు కూడా మస్తాన్వల్లి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని రాజ్ తరుణ్ చెబుతున్నాడు. అలాగే రాజ్ తరుణ్ తో కొత్తగా ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్కు కూడా వేరే బంధాలు ఉన్నాయంటూ మరికొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. పైగా ఈ కేసును కళ్యాణ్ దిలీప్ సుంకర టేక్ అప్ చేయడంతో మామూలు రంజుగా లేదు. మీడియా, సోషల్ మీడియా అంతా వేడెక్కిపోతోంది. ఇక ఆంధ్రలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మధ్య అక్రమ సంబంధం అంటూ హడావుడి మొదలైంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎవరు దీనిపై అంతగా స్పందించలేదు.
ఇప్పుడు శాంతి మొదటి భర్త మదన్మోహన్ స్వయంగా తన భర్య శాంతికి పుట్టిన బిడ్డ విజయసాయిరెడ్డి తండ్రి అవునో.. కాదో తేల్చాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో.. దీనిపై రచ్చ మామూలుగా లేదు. పైగా విజయ్ సాయి రెడ్డికి డీఎన్ఏ టెస్ట్ చేయాలంటూ మీడియా ముందుకు వచ్చి యాగి చేయడంతో.. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియా ఒక రేంజ్లో యాక్టివ్ అయింది. ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా అంతా సైలెంట్ అయిపోయింది. విజయసాయిని డిఫెండ్ చేసే వారే లేరు.. పైగా విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. అలా ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాకు రాజ్ తరుణ్, అటు విజయసాయిరెడ్డి అక్రమ సంబంధాల విషయాలే మంచి న్యూస్ గా మారాయి. అలాగే తెలుగు ప్రజలు కూడా వీటి గురించి ఎక్కడ చూసినా చర్చ పెడుతూ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మరింత రచ్చ చేస్తున్నారు.