జగన్ ఇక డిప్రెషన్లోనుండి బయటపడ్డట్టేనా
అయితే, జగన్ పరిపాలనా కాలంలో మంత్రులు తమ నోటికి ఎంత మాట వస్తే అంత అంటూ ప్రతిపక్షంలోని వారిని పూర్తిగా అవమానించిన సంగతి ప్రజలు బాగా గమనించారు. అంతేకాకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ ని అయితే వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం అందరికీ తెలిసినదే. ఇక పగా ప్రతీకార దాడులు అనేవి షరా సర్వ సాధారణం అయిపోయింది. దాంతో ప్రజలలో ఒకవిధమైనటువంటి నెగిటివ్ టాక్ మొదలయ్యింది. కట్ చేస్తే ఓట్లు మొత్తం కూటమికే ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇక చంద్రబాబుని జైలులో పెట్టిన తరువాత అప్పటిదాకా యాక్టివ్ గా లేని క్యాడర్ మొత్తం రీచార్జితో రెడీ అయిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది వచ్చి కూటమికి అనుకూలంగా పనిచేశారు.
ఇక ఘోర ఓటమి తరువాత జగన్ నిన్న మొన్నటి వరకు బెంగుళూరు యెహలంక పేలస్ కే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలో కార్యకర్తనుండి, నాయకుల వరకు ఎవ్వరినీ జగన్ కలవడానికి సముఖత చూపించలేదు. అయితే తాజాగా పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన మర్డర్ అనంతరం జగన్ యాక్టివ్ అయ్యి మరలా ఏపీకి వచ్చి సదరు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆదుకుంటానని చెప్పిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో జగన్ టీడీపీ కూటమి ప్రభుత్వం పైన నిప్పులు చెరిగిన విషయం విదితమే. ఈ ఘటన తరువాత జగన్ వైఫల్యాన్ని వీడి ప్రజలలోకి వచ్చాడంటూ వైసీపీ వర్గం పండగ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే జగన్ డిప్రెషన్లోనుండి పూర్తిగా బయట పడ్డాడు అనే విషయాన్ని విశ్లేషకులు బయటకి చెబుతున్నారు.