అరవింద్ కేజ్రీవాల్ అంటే దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. ఢిల్లీని ఏకధాటిగా పాలిస్తున్నటువంటి నాయకుడు. కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టు చేసి తీహార్ జైల్లోకి తరలించారు. ఈ విధంగా కేజ్రీవాల్ ను ఈ కేసులో ఇరికించడం వెనక బిజెపి ప్రధాన పాత్ర నుంచి మొదటినుంచి అంటున్నారు. అంతేకాదు జైల్లోనే కేజ్రీవాల్ ను చంపాలని కుట్ర చేశారట. ఈ విషయాన్ని ఆఫ్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో తెలియజేశారు. కేజ్రీవాల్ ఆరోగ్యం పూర్తిగా క్షీనిస్తోందని ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదని వైద్య నివేదికలు చెబుతున్నాయని ఆయన అన్నారు. అయితే ముందుగా ఆయన జైల్లో విపరీతంగా స్వీట్లు తింటూ షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నారని బిజెపి ప్రభుత్వం ఆరోపణలు చేసింది.
ప్రస్తుతం ఆహారం తగ్గించాలని, ఈ విధంగా చేసి తన ఆరోగ్యం తానే పాడు చేసుకునే విధంగా చేయాలని వారు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీని వెనక బిజెపి కుట్ర కోణం దాగి ఉందని, దానికి జైల్లోనే కేజ్రీవాల్ ను చంపేయాలని వారు ప్లాన్ చేశారని సంజయ్ సింగ్ తీవ్రంగా ఆరోపించారు. కేజ్రీవాల్ ఆరోగ్యం విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి సమాచారం అందిందని, జైల్లో కేజ్రీవాల్ వైద్యులు చూపించిన ఆహారం తీసుకోవడం లేదని దీనికి కారణం ఏంటో కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితులపై తమకు జైలు నుంచి సమాచారం అందిందని వెల్లడించారు.
అయితే కావాలనే తక్కువ కేలరీలను ఆహారం తీసుకుంటున్నారని నివేదికలో ఉన్నట్టు రాసిన లేఖలో ఆరోపించారు. అంతేకాదు ఇందులో జులై ఏడవ తేదీన రాత్రి భోజనానికి ముందే ఇన్సులిన్ తీసుకోవడానికి కూడా కేజ్రీవాల్ నిరాకరించినారని తెలియజేశారు. ఇంటి నుంచి ఆహారం వస్తున్నప్పటికీ ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారని ఆరా తీశారు. ఈ విధంగా ఆహారం ముట్టుకోవడం లేదని ఒక అబద్ధపు ప్రచారాన్ని, బయటకు ప్రచారం చేసి ఆయన నిజంగానే చంపేయాలని బిజెపి కుట్ర చేస్తోందని సంజయ్ తెలియజేశారు. ఎవరైనా వారి ఆరోగ్యం వారే కరాబ్ చేసుకుంటారా, ఈ విధంగా బిజెపి ఆడే గేమ్ చూస్తే మాత్రం కేజ్రీవాల్ ను లేపేయడం కోసమే ఇలా ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తోందని ఆయన మీడియా ముందు అన్నారు.