ఏపీ: జగన్ వల్ల మోదీ కూటమికి షాక్ ఇచ్చారా..?
టిడిపి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాజా చేసిన వ్యాఖ్యలను బట్టి ఇవి నిజమనేలా ఉన్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన కూటమి సర్కార్ కి కేంద్రం నుంచి ప్రాజెక్టులు నిధులు సైతం ఇతరత్రా వాటిపైన ఎక్కువగా వస్తాయని ఆశించింది. జనం మెచ్చిన తీర్పుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని టిడిపి ప్రభుత్వం కోరుకుంది. అందుచేతిని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా రాష్ట్ర ఎంపీలని మంత్రులను కేంద్ర మంత్రులకు లింక్ చేసి పలు రకాల శాఖల నిధులను రాబట్టాలంటూ కూడా దిశా నిర్దేశాలు ఇచ్చేశారు. కానీ వీరందరికీ మోది ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రుల్ని కలిపి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని.. అంతేకాకుండా వైసిపి ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల పైన కూడా ఫిర్యాదులు చూపించాలని టిడిపి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, లావు కృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని వేళడించడం జరిగింది. ఇదంతా కేవలం జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యమే అంటూ కూడా ఫైర్ అయ్యారు. గతంలో పలు సాకులు చూపించి ఏపీకి రావాల్సిన విభజన హామీలను సైతం నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది వీటిపైన జగన్ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తే ఖచ్చితంగా కచ్చితంగా ప్రత్యేక హోదా తో పాటు అన్ని హామీలను కూడా కేంద్రం అందిస్తుంది అంటూ జగన్ 2019లో ఓటు వేయించుకున్నడని .. కేంద్రంకు ఎక్కువ మెజారిటీ ఉండడం చేత పట్టించుకోకపోవడంతో ప్రజలలో జగన్ పైన విశ్వాసం కోల్పోయిందని ఇప్పుడు కూటమి వంతు కూడా వచ్చిందని కేంద్ర మంత్రుల నుంచి అందుతున్న వినతుల పైన కూడా పెద్దగా పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి.