ఏపీ అసెంబ్లీ: నల్ల కండువాతో ఎంట్రీ ఇస్తున్న జగన్..?
ఈ క్రమంలో వైసిపి నేతల వద్ద ఉన్న పేపర్లు లాక్కొని పోలీసులు చించేసారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రభుత్వానికి ఊడిగం చేయడానికి కాదని, ప్రజాస్వామ్యం కాపాడడానికి ఉన్నారని జగన్ పేర్కొన్నారు.024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్.. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాసినా స్పందన లేదు. వైసీపీకి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే ఆ పార్టీ సభ్యులకు అసెంబ్లీలో స్థిరమైన స్థానాలను ఇప్పటి వరకూ కేటాయించలేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ శాసనసభకు వచ్చినప్పటికీ మొదటి వరుసలో సీటు దక్కడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సాధారణ ఎమ్మెల్యేగానే వైఎస్ జగన్.. ఎక్కడో ఓ చోట కూర్చోవాల్సి ఉంటుందంటున్నారు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారా.. వస్తే ఎక్కడ కూర్చుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.