వీక్షిత్ భారత్ బడ్జెట్ కహాని ఏమిటి?
ఇకపోతే ఈనెల 23న మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారనే సంగతి అందరికీ తెలిసినదే. దాంతో ఈరోజు ఇవాళ పార్లమెంట్ లో ఆర్థిక సర్వేను ప్రకటించనున్నారు. అయితే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడడం జరిగింది. 2047 నాటికి విక్షిత్ భారత్ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఆయన మీడియా ముఖంగా స్పష్టం చేశారు. మూడోసారి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్న మోదీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి తీరతామని అన్నారు. అమృత కాలంలో ఇదొక అద్భుతమైన బడ్జెట్ అని చెప్పుకొచ్చారు మోడీ.
వచ్చే ఐదేళ్లు దేశాభివృద్ధి కోసం మాత్రమే పోరాడాలని విపక్షాలకు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై ఫైర్ కావడం గమనించవచ్చు. ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ తొలి సెషన్లోనే 140 కోట్ల మంది దేశ ప్రజల మెజారిటీతో ఎన్నికైన ప్రభుత్వం గొంతును నొక్కే ప్రయత్నం చేయడానికి పూనుకుంటున్నారు అని తప్పుబట్టారు. కేంద్ర బడ్జెట్ రానున్న ఐదేళ్ల ప్రయాణానికి దిశానిర్దేశం చేస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో కూడా 2047లో ‘విక్షిత్ భారత్’ కలను సాకారం చేసేందుకు పునాది వేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందని అన్నారు. 60 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందని, అమృత్ కాల్ లో ముఖ్యమైన బడ్జెట్ అని, ఇది 2047లో విక్షిత్ భారత్ కలను నెరవేర్చడానికి పునాది వేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.