బీహార్ vs ఏపీ.. ట్రీట్మెంట్ సేమ్ అంటున్న మోదీ...?
* మోదీ డెసిషన్ తో బాబు ఆలోచన మరేనా.?
* స్పెషల్ ప్యాకేజీ అయినా బాబుకు అందేనా..?
( ఢిల్లీ-ఇండియాహెరాల్డ్ ) : సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెల్సిందే.దాంతో మోదీ ముచ్చటగా మూడోసారి పీఎం అయ్యారు.ఐతే మోదీ ఈసారి పీఎం అవ్వడానికి కావలసిన మెజారిటీ అనేది పార్లమెంట్లో రాలేదు.దాంతో నార్త్ లో బీహార్ నుండి జేడీయూ, ఏపీలో టీడీపీ కూటమి మోదీకు మద్దతు ఇవ్వడంతో ఆయన మూడోసారి పీఎం అయ్యారు.జేడీయూ అనేది 12 మంది ఎంపీలతో కూటమిలో మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. దీంతో జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ డీల్తోనే ఎన్డీయే కూటమిలో జేడీయూ భాగమైందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. ప్రత్యేక హోదా లేని పక్షంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది.
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచించిన కొన్ని అర్హతలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారని తేల్చి చెప్పేసింది.తాజాగా బిహార్కు ఈ అర్హతల్లేవని కేంద్రం స్పష్టం చేసింది.దాంతో ఆంధ్రప్రదేశ్కు కూడా హోదా ఇచ్చే అవకాశం లేనట్లు స్పష్టం అయినట్లు తెలుస్తుంది.అయితే మోదీ కూటమిలో కీలకంగా వ్యవహించిన సీఎం చంద్రబాబుకు కూడా మోదీ షాక్ ఇచినట్లే అని రాజకీయా విశ్లేషకులు అంటున్నారు.అయితే చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కాకపోయినా కనీసం ప్రత్యేక ప్యాకేజ్ రాష్ట్రానికి కావాలంటూ కేంద్రం వద్ద ప్రస్తావించబోటున్నట్లు సమాచారం.మరీ దీనిపై మోదీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరీ. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఆర్ధికంగా దారుణమైన స్థితిలో ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల కోలుకోలేని విధంగా ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహాయం అనేది చాలా అవసరం కాబట్టి మోదీను రిక్వెస్ట్ చేసుకోక తప్పదు చంద్రబాబుకు. అయితే దానిపై మోదీ ఆలోచన ఏంటో చూడాలి మరీ.