ముద్ర రుణాల పరిమితిని భారీగా పెంచిన మోదీ సర్కార్.. రుణం పరిమితి అన్ని రూ.లక్షలా?
ముఖ్యంగా కిసాన్ సన్మాన్ నిధి, పిఎం కిసాన్ యోజన కు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే విధంగా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు సైతం రుణాల పరిమితిని మోడీ సర్కార్ భారీగానే పెంచేసింది.. ముఖ్యంగా ముద్ర రుణాలను రూ .10 లక్షల నుంచిరూ .20 లక్షల రూపాయలకు పెంచినట్లు తెలియజేశారు.. అలాగే బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధి కోసం ఏకంగా రూ .2.66 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. దీనివల్ల రుణ సదుపాయాన్ని సైతం స్వయం ఉపాధి చేయాలనుకునే వారికి ఈ రుణ సహాయాన్ని అందిస్తారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు.. విద్య నైపుణ్య అభివృద్ధికి 1,48 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఉంటుంది అంటూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి బడ్జెట్లో 9 రంగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.. వ్యవసాయ రంగానికి కూడా డిజిటల్ టెక్నాలజీ కూడా అనుసంధానం చేయబోతున్నామని తెలిపారు. విద్య నైపుణ్య అభివృద్ధి కోసం లక్ష 48 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని నిర్మల సీతారామన్ తెలిపారు. 2,47 కల్లా వికసిత్ భారత్ అనే లక్ష్యాన్ని తగ్గినట్లుగానే బడ్జెట్ని రూపకల్పన చేశామంటూ నిర్మల సీతారామన్ తెలియజేశారు.