ఏపీ: మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనలో మరొక ట్విస్ట్..!
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ లో అగ్ని ప్రమాదం ఘటన ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. దీనిపై లోతైన విచారణ జరిపించాలి అంటూ కూడా అధికారులకు ఉత్తరులను జారీ చేశారు.. ఫైర్ సేఫ్టీ డైరెక్టర్, ఏపీ జెన్కో సీఎండీలను సైతం ఈ ఘటన స్థలానికి వెళ్లి మరీ విచారణ చేపట్టాలి అంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీంతో నాగపూర్ నుంచి ప్రత్యేకమైన బృందంతో మదనపల్లికి రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫైల్స్ దగ్ధం కుట్రలను సైతం తేల్చేందుకు అన్ని వర్గాలను అన్వేస్తున్నట్లు ప్రభుత్వం తెలుస్తున్నది. ఎలాంటి చిన్న ఆధారం దొరికిన కూడా ఎవరిని వదలకుండా పట్టుకోవాలని ఉద్దేశంతోనే ఇలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల విభజన తర్వాత పుంగనూరు భూముల దస్త్రాలు చిత్తూరు కలెక్టర్ లో కాకుండా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఎందుకు ఉంచారని కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే పెద్దారెడ్డి బంధువుల ఇంట్లో సోదాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ మదనపల్లి అగ్నిప్రమాదం వెనుక ఎవరెవరు ఉన్నారు అనే విషయం తేలుస్తారా లేకపోతే ఇది అనుకోకుండానే జరిగే సంఘటనగా మిగిలిపోతుందేమో చూడాలి మరి