ఢిల్లీలో వైసీపీకి షాక్.. జగన్ ధర్నాకు బ్రేక్ ?
ఏపీలో జరుగుతున్న హత్యలు, వైసిపి నేతలపై దాడుల నేపథ్యంలో... దానికి నిరసనగా... ఇవాళ వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వచ్చారు. ఇవాళ ఉదయం 10:00 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర.. ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటన కూడా చేశారు.
అయితే వైసిపి నేతలందరూ ఢిల్లీకి చేరిన నేపథ్యంలో.. ఏపీ భవన్ దగ్గర ఆంక్షలు విధించారు పోలీస్ అధికారులు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైసిపి ప్రజాప్రతినిధులు ధర్నాలు చేయకుండా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్న వైసిపి పార్టీకి.. ఊహించని షాక్ ఇస్తూ.... అక్కడ ఆంక్షలు విధించారు పోలీసులు. దీంతో ఇవాళ వైసిపి నేతలు ధర్నా చేస్తారా? ఒకవేళ చేస్తే అరెస్టులు చేయడం గ్యారెంటీ ఆ ? అని అందరూ చర్చించుకుంటున్నారు.