విశాల్: దమ్ముంటే నా సినిమాలు ఆపుకోండి...ఇండస్ట్రీకి వార్నింగ్ ?
ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు హీరో విశాల్. సినిమాలు చేస్తూనే ఉంటా.. ఆపేందుకు ట్రై చేసుకోండి అంటూ ఫిల్మ్ చాంబర్ కార్యదర్శికి కతిరేసన్ కు సవాల్ చేశారు నటుడు విశాల్. 2017-2019 కాలంలో నడిఘర్ సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో 12 కోట్ల రూపాయలను అక్రమంగా ఖర్చు చేశారని విశాల్ పై ఆరోపణలు చేసింది తమిళ ఇండస్ట్రీ. ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ప్రస్తుత సంఘంలోని సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో విశాల్తో ఎవ్వరూ సినిమాలు తీయొద్దని తమిళ నిర్మాతల మండలి చర్యలకు సిద్దం అయింది. దీంతో తమిళ నిర్మాతల మండలి కి కౌంటర్గా విశాల్ పోస్ట్ పెట్టారు.
అసోసియేషన్ నిధులు సంక్షేమ పనుల కోసం వాడామమని...ఎంతో అభివృద్ధి ,సహాయం చేశామని వెల్లడించారు. ముందు నా గురించి కాకుండా చేయాల్సిన పనుల గురించి ఆలోచించండని విశాల్ వేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తన సినిమాలు ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని చురకలు అంటించారు విశాల్. తన సినిమాలు ఆపేందుకు ఎవరూ రారని.. అంత సాహసం ఎవరు చేయలేరన్నారు. మొత్తానికి తమిళ నిర్మాతల మండలి వర్సెస్ హీరో విశాల్ మధ్య జరుగుతున్న ఈ వివాదం... దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మరి దీనిపై తమిళ నిర్మాతల మండలి ఎలా స్పందిస్తుందో చూడాలి.