ఏపీ: జనసేన- టిడిపి మాస్టర్ ప్లాన్ కి.. వైసిపికి ఇబ్బందేనా..?

Divya
2024 లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ 40% ఓటింగ్ తో మాత్రం ఉన్నది.. ఆ పార్టీ రోజుకి బలమైన ప్రత్యర్థి గాని ఇప్పటికీ ఉన్నది అందుకు కారణం ఉమ్మడి 13 జిల్లాలలో వైసీపీ క్యాడర్ చాలా బలంగా ఉందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ పార్టీకి ఉన్న ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కూడా వైసిపి పార్టీ ఈరోజుకి చాలా పశిష్టంగా ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో ఉన్న 100కు పైగా మున్సిపాలిటీ అలాగే కార్పొరేషన్లు జడ్పీ చైర్మన్ పదవులు కూడా అన్ని వైసిపి పార్టీ చేతిలోనే ఉన్నట్లు తెలుస్తున్నాయి.

వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే సర్పంచ్ల నుంచి అలాగే జడ్పిటిసి ఎంపీటీసీలు వైసీపీకి నూటికి 80 మంది దాకా ఉండడం గమనార్హం. ఎమ్మెల్యేలు గెలవకపోయినా కానీ జిల్లాల మండల స్థాయిలలో మాత్రం పాలన అలాగే ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.వీటిని కూడా దెబ్బకొట్టేందుకు టిడిపి జనసేన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కోరిమరి పంచాయతీరాజ్ శాఖ ను కూడా తీసుకోవడం వెనుక గ్రామలలో గ్రాస్ రూట్ లేవల్ని పెంచేందుకు అలాగే తమ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.

అంతేకాకుండా సర్పంచులు, ఎంపీటిసీలు ,జడ్పీ చైర్మన్లు ఇతర వాటిను కూడా తమ వైపు తిప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకమైన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకు వైసిపి కారణమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి . పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా దారి మళ్లించి వాటిని వృధాగా చేశారని ఆగ్రహం కూడా ఇప్పుడు ఉన్నది.ఇప్పుడు చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం కూడా తమ పాలనలో ఏదో ఒకటి చేసి మరి పేరు తెచ్చుకోవాలని గ్రామాలలో మండల స్థాయిలలో కూడా కూటమికి మద్దతు పెంచుకోనేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ తో టిడిపి జనసేన వ్యూహాత్మకమైన చర్యలు చేపడతారేమో చూడాలి మరి. మరి ఈ కూటమి చర్యల వల్ల వైసీపీ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: