ఏపీ: జగన్ పైన కేవలం అది దుష్ప్రచారమేనా..?

Divya
గత వైసిపి పాలనలో చాలామంది ఉద్యోగులు సైతం అసహనంతో ఉన్నారని చెప్పవచ్చు..జగన్ ప్రభుత్వం మీద పోరాడినటువంటి సూర్యనారాయణ.. ఉద్యోగ సంఘనాయకుడు ఆ సమయంలో కాకుండా ఇప్పుడు పదవి నుండి తొలగించబడడం అన్నటువంటిది సంచలనంగా మారింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి కేసుల కష్టాలన్నీ కూడా ఇక పోతాయి అని సంతోషపడుతున్న సమయంలో.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం APGEA రాష్ట్ర పదవి నుంచి కేఆర్ సూర్యనారాయణ తొలగించినటువంటి రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు నిన్నటి రోజున ఒక ప్రకటన కూడా తెలియజేశారు. నూతన అధ్యక్షుడిగా డి శ్రీకాంత్ రాజుని ఐసిడిఎస్ ని ఎన్నుకోవడం జరిగిందట.

సూర్యనారాయణ అరాచకాలు స్వార్థ ప్రయోజనాలు ప్రయోజనాలు చూడలేక ఆయనను పదవి నుంచి తొలగించారనే విధంగా రాష్ట్రస్థాయి సమావేశంలోని వారు తెలియజేశారు ... ఇక తన అన్నతో కలిసి సంఘం సొమ్మును సొంత అకౌంట్లో జమ చేసుకొని ఉన్న ఆర్గనైజేషన్ సెక్రటరీ గొల్ల నాగ సాయి కూడా పదవి నుంచి సస్పెండ్ చేశారు. గత ప్రభుత్వంలో సూర్యనారాయణ గొంతెమ్మ కోరికలు తీర్చకపోవడంతో వైఎస్ఆర్సిపికి ఓటు వేయొద్దంటూ ప్రచారం చేశారంటూ తెలిపారు నారాయణ.. ఉద్యోగుల సమస్యల పేరుతో గవర్నర్ వద్దకు  తమను పంపి బలి చేశారని చెప్పారు..

అలాగే చంద్రబాబు ఏబిఎన్ రాధాకృష్ణ ఇద్దరు కలిసి ఉద్యోగ ద్రోహులుగా చిత్రీకరించారని.. ఇప్పుడు తన ప్రచారం వల్లే చంద్రబాబు సీఎంగా అయ్యారని ప్రభుత్వానికి దగ్గరయ్యాను అలాగే ఉద్యోగులకు నమ్మ బలుకుతున్నారని చెబుతున్నారు.. అయితే ఆయనను ఉద్యోగ ప్రజలను నమ్మవద్దని చాలా మంది కోరారు.. వాణిజ్య శాఖ నుంచి ప్రభుత్వ శాఖకు రావలసిన సొమ్ముని  సొంత ఖాతాలోకి జమ చేసుకున్నటువంటి వాటి మీద సూర్యనారాయణ అరెస్టయ్యారని.. ఆయనను నమ్ముకున్న మరో నలుగురు ఉద్యోగులు కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారని వారు సస్పెన్స్ లో ఉన్నారని తెలియజేశారు పలువురు అధికారులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: