ఏపీ: చేతకాని దద్దమ్మ దిగిపో అంటూ చంద్రబాబుపై రెచ్చిపోయిన లక్ష్మీపార్వతి..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని 2024 ఎన్నికలలో సైతం ఒక్కసారిగా రాజకీయాలను హీటెక్కించేలా చేశాయి. కూటమిలో భాగంగా టిడిపి బిజెపి జనసేన పార్టీలు ఒక్కటిగా నిలిచినప్పటికీ వైసీపీ పార్టీ సింగల్ గా పోటీ చేసి 40% ఓటింగ్ వచ్చినా కూడా కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. కూటమి భారీ విజయాన్ని అందుకుంది.కూటమి విజయానికి ముఖ్య కారణం సూపర్ సిక్స్ హామీలే అని చాలామంది నేతలు తెలియజేస్తున్నారు. అయితే వీటిని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామంటూ అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఊదరగొట్టారు. అయితే గెలిచి సిఎం అయినా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలను ఇంకా అమలు చేయలేదు. హామీలు అయితే చెప్పాము బడ్జెట్ లేదంటూ అసెంబ్లీ సమావేశాలలో తెలిపారు.

దీంతో వైసీపీ నేతలు సైతం అప్పుడే ట్రోల్ కి సైతం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా వైసీపీ మహిళా నేత సీనియర్ ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి కూడా ఏపీ సీఎం చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు. తాజాగా ప్రముఖ ఛానల్ కు లైవ్ లో మాట్లాడిన లక్ష్మీపార్వతి.. సూపర్ సిక్స్ హామీలపైన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు జీవితంలో నిజాలే చెప్పరు. ఆయన ఎప్పుడూ అబద్ధాలు చెబుతారు అంటూ తెలుపుతోంది. ఇక తన ఇంట్లో పని చేసే వాళ్లే వారి గురించి కొన్ని విషయాలు చెప్పారని.. కొంతమందికి పెన్షన్ కూడా సరిగ్గా అందలేదని తెలియజేశారట..

అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఐదువేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉంచామని.. 2000 కోట్ల రూపాయల అప్పు చేసి మొత్తం 7000 కోట్ల రూపాయలను అతి కష్టం మీద జన్మభూమి కమిటీలతో పెన్షన్ ఇచ్చారంటూ ఆమె తెలుపుతోంది. అయితే పెన్షన్ ఇచ్చిన వాళ్ళతో తిరిగి మళ్ళీ 500 నుంచి 2000 రూపాయల లోపు వసూలు చేస్తున్నారు జన్మభూమి కమిటీ పేరు మీద అంటూ ఫైర్ అయ్యింది లక్ష్మీపార్వతి. మేమైతే ఓట్లు వేశాము కానీ జగన్ ఎందుకు ఓడిపోయారో తెలియదు.. చంద్రబాబు ఎందుకు వచ్చారు అంటూ వాపోతున్నారట.
ఒక్క నెలలోనే వీళ్ళ దుర్మార్గ పరిపాలన బయటపడింది అంటూ తెలుపుతోంది. ఎన్నికలకు ముందు దగ్గుబాటి పురందేశ్వరి తో సహా ప్రచారం చేసిందని తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి అప్పులు ఉన్నాయని చెప్పినా కూడా మేము సంపద సృష్టించి డబ్బులు పంచి పెడతామంటూ ఆరోజు ఊదరగొట్టారు అంటూ తెలుపుతోంది. ముఖ్యంగా ఇంతటి ప్రపంచ మేధావి ఎక్కడా లేదంటూ ఆయన నేతలు కూడా ఉదరగొట్టారో తెలుపుతోంది. ప్రజలను చంద్రబాబు మోసం చేసే పద్ధతి ఇదే అంటూ తెలుపుతోంది లక్ష్మీపార్వతి. ఇక చంద్రబాబుకి మరింత ఊదరగొట్టే మీడియా చాలానే ఉందంటూ తెలుపుతోంది. పేరుకే సీఎంగా చంద్రబాబు ఉన్న నడిపిస్తోందంతా లోకేష్ అంటూ తెలుపుతోంది. ఇంట్లో భయం వల్ల కూడా లోకేష్ మాట చంద్రబాబు వింటున్నారని తెలుపుతోంది. హింస రాజకీయాలు అందుకే ఇంత ఎక్కువ చేస్తున్నారంటూ తెలుపుతోంది. ఇలాంటి చేతకాని దద్దమ్మ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే దిగిపోయేదే మంచిదన్నట్టుగా తెలియజేసింది లక్ష్మీపార్వతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: