వైసీపీ నేతను కలిసిన తారతరత్న భార్య.. ఫొటోస్ వైరల్..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి తారకరత్న గత ఏడాది కన్నుమూయడం జరిగింది ముఖ్యంగా నారా లోకేష్ యువ గలం పాదయాత్రలో భాగంగా గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. సుమారుగా రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న మరణ వార్త ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలను మిగిల్చింది. అలాగే తన కుటుంబ సభ్యులకు కూడా తీరని లోటు మిగిల్చింది.. ఇక తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా ఈ విషయంలో ఎన్నోసార్లు కుంగిపోయింది. తన భర్తతో తనకున్న మధుర జ్ఞాపకాలను సైతం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటుంది.

సోషల్ మీడియాలో తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది అలేఖ్య రెడ్డి ఇప్పుడు తాజాగా వైసిపి నేత విజయసాయిరెడ్డికి ఈమె బంధువు అన్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ సాయి రెడ్డి భార్య సోదరి కుమార్తెతో అలేఖ్య రెడ్డి ఫోటోలు దిగుతూ ఆ ఫోటోలను షేర్ చేసింది. అలేఖ్య రెడ్డికి స్వయంగ విజయసాయిరెడ్డి పెదనాన్న అవుతారు. అలేఖ్యను చిన్నప్పటినుంచి విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఎక్కువగా పెరిగిందట.ఇక తారకరత్నతో ప్రేమ విషయాన్ని కూడా విజయ్ సాయి రెడ్డి తన కుటుంబానికి తెలియజేసి మరి వివాహం చేశారట.

తారకరత్న మరణించినప్పుడు కూడా విజయసాయిరెడ్డి దగ్గరుండి చాలా పనులు చూసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు అంత్యక్రియలప్పుడు కూడా అన్ని తానే వ్యవహరించారు విజయసాయిరెడ్డి. ఈ విషయం పైన అటు నందమూరి అభిమానులు కూడా వైసిపి నేతని మెచ్చుకోవడం జరిగింది. విజయసాయిరెడ్డి తో తాజాగా దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి హ్యాపీ బర్తడే బుజ్జి బాబు అని విషెస్ తెలియజేసింది. దీంతో ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ ఫోటోలకు సైతం వైసీపీ కార్యకర్తలు అభిమానులు సైతం లైఫ్ కామెంట్లతో తెగ వైరల్ గా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: