ప్రపంచమంతా ఆర్థిక మాంధ్యం.. భారత్ కు కూడా ముప్పు..!

Divya
చాలా మంది డబ్బులు బాగా సంపాదించాలని ఇతర ప్రాంతాలకు వెళ్లి మరి ఉద్యోగం చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంతర్జాతీయంగా కూడా ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోతున్నారు. తద్వారా ఆర్థికమాన్యం వచ్చిందనే భయాందోళనలో స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్నటువంటి వేళ.. ఇరాన్ ఇజ్రాయిల్ వార్ తో మరింత దారుణమైన పరిస్థితులలో పతనమయింది. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ ఇంఫాక్ట్ కూడా.. స్టాక్ మార్కెట్లను వెంటాడి వేటాడి ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల సొమ్ము ఆవిరి అయిపోయినట్టుగా తెలుస్తోంది. అమెరికా మాంద్యం భయాలు, జపాన్ వడ్డీ పోటు కారణంగానే ఇవి జరిగాయి అన్నటువంటి లెక్క తేలుతోంది.

తాజాగా చూస్తే క్రమంగా ఆర్థిక మాన్యం ఏ స్థాయికి వెళ్తుంది.. ఎందుకంటే ఇప్పటికే రూపాయి 84 రూపాయల తొమ్మిది పైసల కనిష్ట స్థాయికి పడిపోయినటువంటిది.. భవిష్యత్తుతో పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. ఎందుకంటే అమెరికా ,యూరప్ దేశాలలో సంస్థలు బాగా పనిచేస్తుంటే వాళ్లు మనకి ఇక్కడకి పని పంపిస్తూ ఉంటే.. మన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్ వెర్లు, కార్పొరేట్ కంపెనీలు కూడా నడుస్తూ ఉంటాయి.. ఒకవేళ వారికి లేకపోతే మన పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.దీన్ని బట్టి చూస్తే అన్నీ కూడా వీటి మీద ఆధారపడినట్టు కనిపిస్తోంది.

ఇప్పుడు అక్కడే తేడాగా వస్తే.. వాళ్లే మనకు పనులు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే.. అప్పుడు మన వాళ్ళ పరిస్థితి ఏంటో అన్నది సందేహంగా మారిపోయింది.. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి చూడాలి మరి. చాలా మంది కూడా ఇతర దేశాలలో కూడా పనిచేస్తున్న ఇండియన్స్ చాలా మంది ఉన్నారు.. ఇప్పుడు వారి పరిస్థితి కూడా ఏంటా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.. మరి ఎందుకు తగ్గట్టుగా సరైన నిర్ణయాలు తీసుకొని ఎలా ముందుకు వెళ్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: