పొలిటికల్ ప్రేమలు.. కాంట్రవర్సీలు : పవన్ కు తలనొప్పిగా మారిన పూనమ్ పంచాయితీ..?

murali krishna

* పూనమ్ కెరీర్ క్లోజ్ అవ్వడానికి అసలు కారణం అదేనా..?
* పూనమ్ విషయంలో పవన్ ఆ మిస్టేక్ చేసారా..?
పూనమ్ కౌర్.. తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారంటూ వుండరు.ఈ భామ పంజాబ్ లోని సిక్కుల కుటుంబంలో జన్మించింది.తండ్రి బీప్ సింగ్ కౌర్ ,తల్లి భరైన్ కౌర్ ఈమెకు శ్యామ్ సింగ్ లాల్ అనే అన్నయ్య కూడా వున్నారు.పూనమ్ తండ్రికి తాను చేస్తున్న బిజినెస్ లో నష్టం రావడంతో ఫ్యామిలీ తో సహా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు.పూనమ్ నాలుగేళ్ళ వయసులోనే తండ్రి అనారోగ్యం కారణంగా చనిపోయారు.దీనితో కుటుంబ భాద్యత అంతా తల్లిపైనే పడింది.పూనమ్ కు చిన్నప్పటి నుండి  మోడలింగ్ ,యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది .చదువుకుంటూనే మోడలింగ్ ,ర్యాంప్ షోస్ ,కొన్ని యాడ్ లు చేసేది.ఆ తరువాత తన ఫ్యాషన్ డిజైనింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది .ఆ తరువాత ఫుల్ టైం యాక్టింగ్, మోడలింగ్ పై దృష్టి పెట్టింది.అప్పట్లో అందాల పోటీలో గెలిచిన అమ్మాయిలకు హీరోయిన్స్ గా అవకాశాలు ఎక్కువగా రావడంతో పూనమ్ కౌర్ హీరోయిన్ కావాలని డిసైడ్ అయ్యారు.దర్శకుడు తేజ తనతో ఒక సినిమా అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది.ఈ లోపు స్టార్ డైరెక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డి తెరకెక్కించిన మాయాజాలం అనే సినిమాతో పూనమ్ హీరోయిన్ గా పరిచయం అయింది.ఆ సినిమా అంతగా ఆడలేదు.ఆ సినిమా తరువాత తేజ డైరెక్షన్ లో వచ్చిన 'ఒక v చిత్రం' సినిమాలో నటించింది.ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు.ఇలా తెలుగులో చాలా సినిమాలు చేసిన ఈ భామకు అంతగా గుర్తింపు రాలేదు.స్టార్ హీరో సరసన నటిస్తే తనకి మంచి గుర్తింపు వస్తుందని ఆమె భావించింది.
అదే సమయంలో పవన్ కళ్యాణ్, రైటర్ గా త్రివిక్రమ్ కాంబినేషన్ లో తీన్మార్ మూవీ ఆడిషన్స్ జరిగింది.ఇందులో సెకండ్ హీరోయిన్ గా పూనమ్ ని త్రివిక్రమ్ సెలెక్ట్ చేశారట. అయితే పూనమ్ కు  కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చెప్పారట .దీనికి పూనమ్ కూడా ఓకే చెప్పేసిందని సమాచారం.ఈ సినిమా కోసం పూనమ్ ఇతర మూవీ ఆఫర్స్ సైతం వదులుకుంది. నెలల తరబడి హీరో ,డైరెక్టర్ తో ట్రావెల్ అయింది.కానీ ఏమైందో ఏమో తెలీదు గాని ఉన్నట్టుండి పూనమ్ ఓకే చెప్పిన పాత్రలో కృతి కర్బందాను హీరోయిన్ గా తీసుకున్నారు.అలా ఆ సినిమా పూర్తి అయి యావరేజ్ టాక్ తెచ్చుకుంది.అయితే ఆ తరువాత పూనమ్ కు అంతగా ఆఫర్స్ రాలేదు.కానీ ఊహించని విధంగా కత్తి మహేష్ పవన్ ,పూనమ్ సాన్నిహిత్యాన్ని బయట పెట్టారు.ఆయన చెప్పిన విషయాలు విని అందరు షాక్ అయ్యారు.
పవన్, పూనమ్ లివింగ్ రిలేషన్ లో వున్నారని ఆ సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం జరిగిందని ఈ విషయం తెలిసిన రేణు దేశాయ్ పవన్ నుంచి విడిపోయారని ,ఆ సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ కలుగజేసుకొని ఆమెకు జరిగిన నష్టానికి 5 కోట్లు ఇచ్చి తనని అబార్షన్ చేయించుకొని ఈ విషయాన్నీ ఇంతటితో క్లోజ్ చేసేయమని చెప్పడం , పూనమ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా నచ్చజెప్పడంతో పూనం ఒప్పుకుందని అప్పట్లో ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ ఇప్పటికి పూనమ్ పవన్ ,త్రివిక్రమ్ పై విరుచుకుపడుతూనే ఉంటుంది.గతంలో పోసాని సైతం ఈ విషయంపై మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ విషయంపై పూనమ్ ఎప్పుడు స్పందించలేదు.సోషల్ మీడియాలో  మాత్రం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: