తెలుగు పొలిటికల్ ట్రోలింగ్.. బ్రతికుండగానే చంపేసిందిగా..!

Divya
•మాట పొరబాటు..
•లేట్ చంద్రబాబు నాయుడు అంటూ కామెంట్
•గొప్పగా స్పీచ్ ఇచ్చి అంతలోనే ట్రోలింగ్..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గము నుండి టిడిపి పార్టీ తరపున పల్లె సింధూర రెడ్డి పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది . ఒక యంగ్ లీడర్ ఎమ్మెల్యేగా గెలుపొందితే తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని అక్కడ యువత విశ్వసించారు. అందులో భాగంగానే ఈమెకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. ప్రచారంలో భాగంగా గడపగడపకు వెళ్లి మరి ప్రచారం చేపట్టిన ఈమె ప్రచారంలో భాగంగా బాలయ్య గొప్పతనం గురించి కూడా చెప్పి అందరిని ఆకట్టుకుంది ముఖ్యంగా ప్రచారంలోనే బాలకృష్ణ చేత శభాష్ అనిపించుకుంది సింధూర రెడ్డి.
లెజెండ్రీ నే ఆకట్టుకుంది అంటే ఇక సామాన్య ప్రజలు ఎంత తన స్పీచ్ లతోనే అందర్నీ ఆకట్టుకున్న సింధూర రెడ్డి అనుకున్నట్టుగానే ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో పదవీ ప్రమాణ స్వీకారం చేసింది. అయితే ఇక్కడే కాస్త తడబడినట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ లో ప్రమాణస్వీకారం చేసి అందర్నీ ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా ఇంగ్లీషులో మాట్లాడి అందరిని అబ్బురపరిచింది. అయితే ఇక్కడే వచ్చి పడింది అసలు చిక్కంతా.. అందరి చేత చాలా బాగా మాట్లాడుతోంది అంటూ ప్రశంసలు అందుకున్న ఈమె అంతలోపే కాంట్రవర్సీకి గురైంది.
స్పీచ్ లో భాగంగా లేట్ నందమూరి తారక రామారావు అని చెప్పబోయేది పోయి లేట్ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి కాంట్రవర్సీకి చోటు ఇచ్చింది అయితే వెంటనే తన తప్పును సరిచేసుకుంది. కానీ అంతలోనే ట్రోల్స్ భారీగా పెరిగిపోయాయి. చాలామంది ఈ వీడియోని కట్ చేసి మీమ్స్ వేస్తూ వైరల్ చేసేసారు. మొత్తానికైతే పొలిటికల్ ట్రోలింగ్ ఈమె పై భారీగా పడిందని చెప్పవచ్చు. బ్రతికుండగానే చంపేసిందంటూ చాలామంది కామెంట్లు చేశారు. ఇక  ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సింధూర రెడ్డి అక్కడి ప్రాంత సమస్యలను అసెంబ్లీలో చాలా ధైర్యంగా చెప్పుకుంటూ ఆ సమస్యలను తీర్చే పనిలో పడింది.  మరి ఏ మేరకు పుట్టపర్తి జిల్లా ప్రజలకు మేలు చేస్తుందో,  ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: