ఏపీ : రాజధాని విషయంలో అలాంటి ప్లాన్ చేస్తున్న చంద్రబాబు..!

Divya
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజులపాటు ఢిల్లీలోనే పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది.. కేంద్రమంత్రి సి ఆర్ పాటిల్ తో రెండు రోజులపాటు భేటీ కాబోతున్నారట. ఆ తర్వాత పార్టీ ఎంపీలతో భేటీ కాబోతున్నారట. మరొకవైపు ప్రధానమంత్రితో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారట. ఎక్స్పెషల్లీ రేపటి సాయంత్రం నిర్మల సీతారామన్ తో భేటీ కాబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాత్రి 7 గంటలకు అమిత్ శాతో బేటి కాబోతున్నారట. మొత్తం మీద అమరావతికి సంబంధించి ఒక చట్టబద్ధమైనటువంటి సొల్యూషన్ చేయడం కోసమే ఇలా చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకటి ఫైనాన్షియల్ గా నిర్మల సీతారామన్ తో అలాగే చట్టబద్ధంగా ఒక క్యాపిటల్ ని మార్చడానికి వీలు లేనటువంటి విధంగా చట్టం ఏది చేయాలి.. ఒకసారి ఫిక్స్ చేసి ఏదైనా నోటిఫికేషన్ చేసేస్తే.. ఇక దానిని మార్చడానికి వీలు లేదు. అప్పుడు రాజధాని మార్చాలి అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందట. కేంద్రంలో హోం శాఖ అనుమతి తీసుకోవడమే కాకుండా పార్లమెంటులో కూడా తీసుకోవలసి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఉండేటట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అలాంటి చట్టాన్ని కూడా తయారు చేసే విధంగా ఒక ప్లాన్ చేస్తున్నట్లు టిడిపి వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి రాజధాని అన్నట్టుగా ఒక పిన్కోడ్ ఇచ్చేసారంటే ఆ పిన్కోడ్ని సైతం మార్చడానికి వీలుండదు.. అప్పుడు కూడా క్యాపిటల్ ని మార్చడానికి వీలుండదు. అలాంటి విధానాల గురించి ఆలోచిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు అలాగే ఫండింగ్ కి సంబంధించిన విషయాలను కూడా  మాట్లాడ బోతున్నారట. ఢిల్లీ సర్కిల్స్ లో ఈ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ని రాజధాని చేస్తారని కూడా తెలియజేశారు.. అందుకే ఈసారి అలాంటివి చేయకుండా పగడ్బందీగా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: