ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో గురు శిష్యులు సీఎంలు అయ్యారు. ఏపీ రాష్ట్ర సీఎంగా చంద్రబాబు అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయ ఓనమాలన్ని నేర్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి తన గురువుతో పోటీపడి మరి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేలా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి సీఎంలు వచ్చిన వెంటనే పథకాలను అమలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అమలు చేశారు.
చంద్రబాబు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలకు అనేక పథకాలను ప్రారంభిస్తున్నారు. ఇవే కాకుండా యువతకు ఉద్యోగ కల్పన అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో వివిధ కంపెనీల పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకి కంపెనీలు బారులు తీరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు త్వరలో జరగబోయే సదస్సును పురస్కరించుకొని ఇప్పటికే టాటా చైర్మన్ వచ్చి చంద్రబాబును కలిశారు. అంతేకాకుండా మిగతా కంపెనీల ప్రతినిధులు కూడా చంద్రబాబుతో కలిసి భేటీ అవుతున్నారు. అంతేకాకుండా బార్ కౌన్సిల్ వారు కూడా వారి యొక్క ఇన్స్టిట్యూట్ పెట్టడానికి ముందుకు వస్తున్నారట.
ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల డెవలప్ చేసేందుకు కంపెనీలు అనేకం వస్తున్నాయి. అంతేకాకుండా తెలంగాణకు కూడా పాక్స్ కాన్ చైర్మన్ ఎంగ్లీ ఢిల్లీ వెళ్లిన సందర్భంలో రేవంత్ రెడ్డిని కలిశారట. ఇక ఈయనే కాకుండా చాలామంది కంపెనీల ప్రతినిధులు ఆయనతో భేటీ అయి హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని కోరాడట. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇన్వెస్టర్లే మా వెనుక పడుతున్నారు పెట్టుబడులు పెట్టేందుకు మమ్మల్ని సంప్రదిస్తున్నారు అంటూ బయట చెప్పుకొస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం రాబోవు ఐదేళ్లలో అనేక కంపెనీలు తెలుగు రాష్ట్రాలకు వస్తే మాత్రం యువతకు ఉపాధి దొరుకుతుందని అంటున్నారు.