మీ చావు మీరు చావండి.. నేను బెంగళూరు పోతున్నా అంటోన్న జగన్ ..?
జగన్ తన రాజకీయలు అన్నీ కుట్రల మీదనే ఉండేలా చేసుకుంటారు. జగన్ కుట్ర రాజకీయాల సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చేవారి గురించి బయటకు తెలియకుండా ఉండేందుకు ఆయన బెంగుళూరుకు మకాం మార్చారని అంటున్నారు. జగన్ హైదరాబాదులో ఉండి కుట్రలు .. కుతంత్రాలు పన్నేందుకు సమావేశాలు పెట్టిన బయట తెలిసిపోతుంది అదే బెంగుళూరులో ఉంటే ఎవరికి తెలియదు. పైగా బెంగళూరు నుంచి వేరే చోటుకు వెళ్లిన ఎవరికి తెలియదు .. తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకే జగన్ ఎక్కువగా బెంగుళూరులో ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. అదే టైంలో సొంత రాష్ట్రంలో ఉండి రాజకీయాలు చేయకపోతే క్యాడర్కు ధైర్యం ఉండదు. అసలే పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది.. అయితే ఇప్పుడు జగన్ పార్టీ నాయకులను పార్టీ కేడర్ను ఎంత మాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.. పార్టీలో ఉన్న వాళ్లే ఉంటారు ..పోయిన వాళ్లే పోతారు అన్నట్టుగా జగన్ ఉన్నారు.