ఎన్టీఆర్ బ్రాండ్ ఇదే.. 2 రూపాయలకే కిలో బియ్యంతో పేదల ఆకలి తీర్చారుగా!
వైసీపీ నేతలు సైతం సీనియర్ ఎన్టీఆర్ గారికి ఒక శకం ఉందని 2 రూపాయలకే కిలో బియ్యం అనే పథకం ఎన్టీఆర్ పేదోడి కోసం పెట్టారని అన్నారు. ఒక సందర్భంలో పేర్ని నాని ఈ కామెంట్లు చేశారు. 2 రూపాయలకే కిలో బియ్యంతో దేశ చరిత్రలో సంచలన పథకం అమలైంది. తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్ పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించారు. ఈ పథకంతో సీనియర్ ఎన్టీఆర్ సంక్షేమంపై చెరగని సంతకం చేశారని చెప్పవచ్చు.
సీనియర్ ఎన్టీఆర్ స్పూర్తితో పలువురు 2 రూపాయలకే భోజనం పెట్టారంటే ఈ పథకం ప్రజల మదిలో ఏ స్థాయిలో స్థానం సంపాదించుకుందో సులువుగా అర్థమవుతుంది. ఈ పథకం గురించి తెలిసి ఇతర రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని అమలు చేశారంటే ప్రజల్లో ఈ పథకానికి ఎంత మంచి పేరు ఉందో సులువుగానే అర్థమవుతుంది. ఈ పథకం అమలుతో ఎన్టీఆర్ ప్రజల మనస్సులో చెరిగిపోని ముద్ర వేశారు.
ఎంతోమంది రాజకీయ నేతలు ఉన్నా ప్రజల మనస్సులను గుర్తు పెట్టుకుని పథకాలు అమలు చేసే నేతలు కొంతమంది ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్ మహా నేత కాగా ఈ జనరేషన్ కు చెందిన వాళ్లు సైతం ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. సీనియర్ ఎన్టీఆర్ పేరు బ్రాండ్ గా మారిపోగా ఈ బ్రాండ్ చెక్కు చెదరని బ్రాండ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం అమలవుతున్న ఎన్నో పథకాలకు ఎన్టీఆర్ స్పూర్తి అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.