సంపద సృష్టిలో భాగంగా బాబు మరో భారీ అడుగు..??
బాబు సంపద సృష్టిలో ఏమాత్రం తగ్గడం లేదు. రూ.2800 కోట్ల పెట్టుబడిపై చర్చించేందుకు ఆయన ఇటీవల గోద్రెజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇదొక భారీ అడుగు అని చెప్పవచ్చు. బాబు ఒక ట్వీట్లో, "నేను గోద్రెజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధి బృందంతో ఒక ప్రొడక్టు మీటింగ్ నిర్వహించాను, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ నాదిర్ గోద్రెజ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. మేము అమరావతి, విశాఖపట్నంలలో పురుగుమందుల తయారీకి రూ.2800 కోట్లతో సహా మరిన్ని పెట్టుబడుల గురించి చర్చించాము." అని తెలిపారు.
అంతే కాదు బాబు గోద్రెజ్తో వ్యవసాయం, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో సహా ఇతర అవకాశాలను అన్వేషించారు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పెంచే లక్ష్యంతోనే చేస్తున్నారు. గోద్రెజ్ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, గౌరవనీయమైన సంస్థ, ఈ పెట్టుబడిని పొందడం ద్వారా వ్యాపారం చేయడానికి సురక్షితమైన ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ కీర్తిని మరింత బలోపేతం చేయవచ్చు.
ఇదిలా ఉంటే, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా యాక్టివ్గా ఉన్నారు, ఇటీవల ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తండ్రీకొడుకులు తమ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నట్లు ఈ ఘటనలతో స్పష్టం అవుతుంది. ఒకవేళ ఆయన మాట్లాడే అన్ని చర్చలు సఫలమైతే ఏపీ బాగా డెవలప్ అవుతుంది. నిరుద్యోగులకు సరిపడా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. దీనివల్ల ఏపీ ప్రజలు వేరే రాష్ట్రాలకి వెళ్లాల్సిన అవసరం కూడా రాదు.