వందల కోట్ల ఫామ్ హౌస్.. ఆ మాజీ మంత్రికి బినామీగా వేణు స్వామి..?
ఇక విషయంలోకి వెళ్తే.. యూపీ మాజీమంత్రి గాయత్రీ ప్రజాపత్ ప్రస్తుతం జైల్లో ఊసలు లెక్కిస్తున్నాడు. ఈయన యూపీలో పెద్ద గ్యాంగ్ స్టర్ అలాగే అత్యాచారం,హత్యలు వంటివి చేసి జైలు జీవితం గడుపుతున్న గాయత్రి ప్రజాపత్ తో వేణు స్వామికి లింకు ఉందని వేణు స్వామి గాయత్రి ప్రజాపత్ లు చాలాసార్లు కలిసారని ఫోటోలను కూడా బయటపెట్టారు మూర్తి. అయితే వీరిద్దరూ యూపీలో కలిసారా లేక హైదరాబాదులోనే కలిశారా అనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా వేణు స్వామి భార్య వీణ మా ఫామ్ హౌస్ అంటూ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.అయితే ఈ ఫామ్ హౌస్ హైదరాబాద్ శివార్లలో ఉంది. ఇక ఈ ఫామ్ హౌస్ విలువ ఏకంగా వందల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.అయితే ఈ ఫామ్ హౌస్ తమదేనని వేణు స్వామి దంపతులు అంటున్నారు
కానీ ఇందులో నిజం లేదు ఈ ఫామ్ హౌస్ యూపీ కి చెందిన మాజీ మంత్రి గాయత్రి ప్రజాపత్ కి సంబంధించినదని, ఈ ఫామ్ హౌస్ పై వెంటనే సిబిఐ,ఈడి విచారణ జరిపించి అసలు నిజం బయటపెట్టాలి అని జర్నలిస్టు మూర్తి డిమాండ్ చేసారు.. దీనికి సంబంధించిన విషయాలు త్వరగా బయటపెట్టాలి అంటూ మూర్తి డిమాండ్ చేయడంతో మరోసారి వేణు స్వామి వివాదంలో ఇరుక్కున్నట్టయింది. మరి ఈ ఫామ్ హౌస్ వేణు స్వామి దేనా లేక మాజీ మంత్రి గాయత్రి ప్రజాపత్ దా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వేణు స్వామిదే అయితే వందల కోట్ల విలువ చేసే ఆ ఫామ్ హౌస్ వేణు స్వామి కొనుగోలు చేశాడంటే అందర్నీ బ్లాక్మెయిల్ చేస్తూ పూజలు చేసి ఎన్ని కోట్లు కొట్టేసాడో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఈ వార్త తెలిసిన చాలా మంది సామాన్య జనాలు. మరి చూడాలి వేణు స్వామి టీవీ ఫైవ్ మూర్తిల వ్యవహారం ఇంకా ఎక్కడి వరకు దారి తీస్తుందో