ఏపీ: వరదల్ని కూడా క్యాష్ చేసుకుంటున్న దోపిడీ ముఠా.. సీఎం గ్రహించేనా..?

Divya
రెండు తెలుగు రాష్ట్రాలలోనే ప్రజలను వర్షాల వల్ల వరదల వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారు.. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉండే ప్రజలు భయభ్రాంతులను మనం చేస్తోంది. గత మూడు రోజులకు కురిసిన భారీ వర్షాలకు మీరు రాష్ట్రాలలో పడిన వర్షాలకు నదులు వాగులుగా నీరు పోటేత్తుతున్నాయి. కృష్ణానది ఉధృత రూపం కూడా దాల్చడంతో ఎన్నడూ లేని విధంగా నీటి ప్రవాహం ఎక్కువయింది. దీంతో విజయవాడలో చాలా ప్రాంతాల సైతం నడుం లోతు పైగా నీరు ప్రవహిస్తోంది. చాలా భవనాలలో నీరు నిండిపోయాయి.

దీంతో ప్రజలు ఆహారం లేక తాగునీరు లేక చాలా అలమటిస్తున్నారు. దీంతో ప్రభుత్వాన్ని కూడా యాచించడం జరిగింది. లోతట్టు ప్రాంతాలలో చిక్కుకున్న వారిని పడవలలో తరలించడానికి కూడ ప్రైవేటు వ్యక్తులు భారీగా వసూలు చేస్తున్నారు. విజయవాడ ప్రాంతంలోని కాకుండా చుట్టు ప్రాంతాలలో కూడా ప్రజలను బయటకు తీసుకురావడానికి సుమారుగా రూ 2,500 నుంచి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా ప్రజలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేటు బోట్లు యాజమాన్యాలు ఈ స్థాయిలో ప్రజల దగ్గర నుంచి లాక్కుంటున్నారా. మరి ఈ విషయాలను ప్రభుత్వం గుర్తిస్తుందా లేదా గుర్తించి ప్రజలకు ఏదైనా సహాయం చేస్తున్నామో చూడాలి.

కేవలం రెండు కిలోమీటర్ల దూరంకే ఇలా అంటి వసూలు చేయడంతో ప్రజలు సైతం విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. కనీసం మానవత్వం లేకుండా వరదలలో చిక్కుకున్నామన్నట్టుగా ప్రభుత్వము పట్టించుకోలేదని విమర్శలు చేస్తున్నారు. మరి ప్రజల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం కానీ ఇతరత్న సంస్థలు కానీ ఎలాంటి సహాయాలు చేస్తాయో చూడాలి మరి. ముఖ్యంగా లైవ్ బోట్లను కూడా అక్కడక్కడ ఉంచిన కూడా ప్రజలు మాత్రమే ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు ముఖ్యంగా ఆహారం నీటి కోసం చాలా అలమటిస్తున్నట్లుగా పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కూడ విరాళం అందిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: