సీఎం రేవంత్‌ని కలిసిన కుమారి ఆంటీ.. ఎంత డొనేట్ చేసిందంటే..?

Suma Kallamadi
సోషల్ మీడియా పుణ్యమా అని కుమారి ఆంటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఆంటీ హైటెక్ సిటీలో టేస్టీ ఫుడ్స్ చాలా తక్కువ ధరకే అమ్ముతుంది. ఆమె స్ట్రీట్ ఫుడ్ కోసం వందల సంఖ్యలో జనాలు క్యూ కడతారు ఆమె కేవలం మూడు నాలుగు గంటలు మాత్రమే ఫుడ్ సేల్ చేస్తుంది ఆ సమయంలోనే ఆమెకు జనాలు కిటకిట వ్యాపారం కూడా బాగా సాగుతుంది లక్షల్లో ఆమె డబ్బు సంపాదిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ రేంజ్ లో ఈమె పాపులర్ అయ్యింది. ఒకసారి, సైబరాబాద్ పోలీసులు ఆమె స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌ను మూసివేశారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే రంగంలోకి దిగి.. ఆమెను వ్యాపారం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
అయితే దాని తర్వాత కుమారి ఆంటీ బుధవారం వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు. చివరకు ఆ రోజు రానే వచ్చింది. అతన్ని కలిసే అవకాశం లభించింది. తన వ్యాపారాన్ని కొనసాగించడంలో సహాయపడినందుకు ఆమె అతనికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె సీఎం సహాయ నిధికి 50 వేల రూపాయలను విరాళంగా అందజేసింది.
కుమారి ఆంటీ ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించడంతో సీఎం రేవంత్ రెడ్డి చలించిపోయారు. ఆమెను సత్కరించిన ఆయన, వీధి ఆహార వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కుమారి ఆంటీ సీఎంకు చెక్కు అందజేసి సన్మానిస్తున్న చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ప్రజలు ఆమెను ఆన్‌లైన్‌లో చాలా ప్రశంసించారు. చిరు వ్యాపారి అయినా సరే తన వంతుగా ఆమె 50,000 అందజేయడం నిజంగా చాలా గ్రేట్ అభినందనీయం ఆమెను చూసి మరింత మంది ముందుకు రావాలి అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇంతకుముందు సినిమా సెలబ్రిటీలో కోట్లలో డబ్బులు అందజేసే గొప్ప మనసును చాటుకున్నారు ప్రభాస్ ఐతే ఎవరు ఊహించినంత అమౌంట్ ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: