ఏపీ : ఈ పని చేస్తే చంద్రబాబు చరిత్రలో నిలుస్తారు..50 ఏళ్ళకే..?

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలలో గెలవడానికి ముఖ్య కారణం సూపర్ సిక్స్ హామీలనే కూడా అందరికీ తెలిసిందే.. అయితే ఇందులో కేవలం పింఛన్ ని 4 వేలకు పెంపు మాత్రమే అమలు చేశారు. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.. ముఖ్యంగా కొత్త పింఛనీల వ్యవహారం ఇప్పుడు మరొకసారి తెర మీదకి వచ్చింది. దీంతో 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కూటమి నేతలు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు.

ఇప్పుడు ఆ వైపుగానే అడుగులు వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనార్టీ వారందరికీ ₹4,000 పింఛన్ కు సంబంధించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైతే పింఛన్ అర్హత 60 ఏళ్లు ఉండగా.. వీటిని చంద్రబాబు 50 ఏళ్లకే పించిని ఇచ్చేలా సమగ్ర చర్యలు చేపడుతున్నారట. సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 50 నుంచి 60 ఏళ్ల మధ్య కలిగిన వారు 15 లక్షల మంది పైగా గుర్తించినట్లు సమాచారం.

అయితే వీరందరికీ కూడా పించిని  అందజేసే విధానం పైన ఒక కార్య చరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారట. ముఖ్యంగా జిల్లాల వారీగా కూడా లెక్కలేసి మరి ప్రభుత్వం సేకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్హత లేకున్నా కూడా కొంతమంది పెన్షన్ తీసుకుంటున్నారని ఆస్థానంలో కొత్త పెన్షన్ దారులకు అవకాశం ఇచ్చేలా సన్నహాలు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు 50 ఏళ్లకే పింఛన్ వ్యవహారాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా ఇది చరిత్రలో నిలిచిపోతుందని కూడా చెప్పవచ్చు. మరి కొంతమంది మాత్రం ఇప్పటికే ఏపీ అప్పుల పాలయ్యింది అంటున్నారు మరి ఇలాంటి సమయంలో ఇలాంటి రిస్కు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: