మోదీ కోసం అమెరికా అంత ఖర్చు పెడుతుందా?

Chakravarthi Kalyan

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ముఖ్యంగా విదేశాల్లోని భారతీయులు ఆయన్ను ఎంతగానో అభిమానిస్తుంటారు. మోదీ గత పదేళ్లలో ఆయా దేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడి భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతుంటారు. మోదీ మోదీ అంటూ హోరెత్తిస్తుంటారు.


కాగా సెప్టెంబరు 22న నరేంద్ర మోదీ అమెరికాలోని న్యూయార్క్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మోదీ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ మోదీకి ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధమైంది. దీనికి న్యూయార్క్ నగరంలోని నసావె వెటరన్స్ మెమోరియల్  కొలిజియాన్ని వేదికగా నిర్ణయించారు. కాగా 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మోదీ న్యూయార్క్ లో జరిగిన భారీ కమ్యూనిటీ సమావేశానికి హాజరైన సంగతి తెలిసిందే.


న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ఈ కార్యక్రమం జరిగింది. మళ్లీ 2019లో మోదీ అమెరికాలో పర్యటించారు. అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన టెక్సాస్ లోని హ్యూస్టన్ లో జరిగిన మెగా కమ్యూనిటీ ఈవెంట్ లో పాల్గొన్నారు. అందులో అప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పాల్గొనడం విశేషం.


ఇక ఇప్పుడు మోదీ యూఎస్ ప్రొగ్రెస్ టుగెదర్ కార్యక్రమానికి ఏకంగా 14 వేల మంది హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు వస్తున్నారు. 500 మంది కళాకారులు, 350  మంది వాలంటీర్లు, 85 మీడియా సంస్థలు, 40కి పైగా అమెరికా రాష్ట్రాలు  ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి.


ప్రధాన వేదికపై గ్రామీ అవార్డు నామినీ చంద్రికా టాండన్, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా విజేత ఐశ్వర్య మజుందార్ సహా వివిధ జాతీయ, అంతర్జాతీయ కళాకారులు తమ ఆట, పాటలతో అలరించనున్నారు. అలాగే ఇంకో వేదికపై 117 మంది కళాకారులు తమ అద్భుత ప్రదర్శనతో అలరించనున్నారు. మోదీ యూఎస్ ప్రొగ్రెసివ్ కార్యక్రమంలో భాగంగా ఎకోస్ ఆఫ్ ఇండియా ఏ జర్నీ ఆఫ్ రఆర్ట్ అండ్ ట్రెడీషన్ నిర్వహించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: