ఒవైసీ కాలేజీలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ?

Veldandi Saikiran
తెలంగాణ బిజెపి పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బండి సంజయ్ కుమార్ నోరు తెరిస్తే చాలు... అన్ని వివాదాస్పద వ్యాఖ్యలు వస్తాయి. ముఖ్యంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఉద్యమకారుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును.. తిట్టడంలో ముందు వరుసలో ఉంటారు బండి సంజయ్. అయితే అలాంటి బండి సంజయ్ తాజాగా ఓవైసీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఓవైసీ కుటుంబానికి సంబంధించిన కాలేజీలలో... ఉగ్రమూకలు ఉన్నారని బాంబు పేల్చారు బండి సంజయ్ కుమార్. ఓవైసీ కాలేజీలో టీచర్లు ఉగ్రవాదులేనని... వాళ్లు పాకిస్తాన్ కు సంబంధించిన వారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. వీళ్లంతా రహస్యంగా హైదరాబాద్కు చేరుకున్నారని కూడా తెలిపారు. ఓవైసీ కాలేజీలలో చాలా.. దారుణాలు జరుగుతున్నాయని కూడా బండి సంజయ్ పేర్కొనడం జరిగింది. హిందుత్వాన్ని చంపేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
 
హిందువులకు భయపడే ఓవైసీ... విపరీతంగా బీఫ్ తింటున్నారని కూడా తెలిపారు. దీంతో బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో కూడా ఓవైసీ పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన కూడా బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికలు రాగానే బిజెపి వర్సెస్ ఎంఐఎం పార్టీలు... బండ బూతులు తిట్టుకుంటాయి అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సైలెంట్ అయిపోతాయి.
 
ముఖ్యంగా కాంగ్రెస్ ఓటును చీల్చేందుకు ఎంఐఎం.. బిజెపి పార్టీకి సహాయం చేస్తుందని కొంత వాదన ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నిక జరిగిన కూడా.. ముస్లిం ఓట్లను చీల్చేందుకు... ఎంఐఎం పార్టీ  కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెబుతూనే ఉంటుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే... అక్కడ ఎంఐఎం పార్టీ పో టీ చేస్తే కచ్చితంగా కాంగ్రెస్ ఓట్లు చీలిపోతాయి. దీంతో బీజేపీ గెలుస్తుంది అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: