చంద్రబాబు పాలనపై సోనూసూద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Suma Kallamadi
నటుడు సోనూసూద్‌ గురించి జనాలకి పరిచయం చేయాల్సిన పనిలేదు. వెండి తెరపై విలన్ పాత్రల్లో మెప్పించిన ఈ హీరో రియల్ లైఫ్ లో మాత్రం హీరో అని చెబుతూ ఉంటారు. కరోనా కష్టకాలంలో సోనూసూద్ ప్రజలకు ఎంత సహకారం అందించాడో జనాలకు బాగా తెలుసు. ఇక అసలు విషయంలోకి వెళితే, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ‘మంచి ప్రభుత్వం’ అనే నినాదంతో టీడీపీ ప్రచార కార్యక్రమం ఒకటి చేపడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే 100 రోజుల్లో తమ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందన్న వివరాలను తెలియజేస్తున్నారు.
ఇక ఇదే విషయమై చంద్రబాబు 100 రోజుల పాలనపై వారి పార్టీ నాయకులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా సోనూసూద్ సైతం చంద్రబాబు 100 రోజుల పాలనపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం మనం గమనించవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన విశిష్ట పాలనతో తొలి వంద రోజుల్లోనే ఏపీ ప్రజలు సుఖసంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని, ఇది చాలా అరుదైన విషయం అని అన్నారు. ఈ విషయమై ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది.
సదరు వీడియోలో సోసూద్‌ మాట్లాడుతూ.. "సుదీర్ఘ కాలం పాలనానుభవం ఉన్న సీబీఎన్‌ సార్‌ తన విజన్‌తో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆయన విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ వయస్సులో కూడా ఆయన ప్రజలకు చేస్తున్న సేవను చూసి గర్వపడుతున్నాను. త్వరలోనే ఆయన్ను కలవాలని కోరుకుంటున్నా!" అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఏపీని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సాయం చేస్తానని సోనూసూద్ మాటిచ్చారు. ఇక పాలనలో సుదీర్ఘమై అనుభవం ఉన్న చంద్రబాబు.. ఏపీ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ చేస్తారని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: