వంగ‌వీటి రాధాకు గుండెపోటు... ఆందోళ‌న‌లో రంగా - రాధా ఫ్యాన్స్‌.. విజ‌య‌వాడ‌లో టెన్ష‌న్‌...!

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్  తగిలింది. తెలుగుదేశం పార్టీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ లీడర్ అయిన వంగవీటి రాధాకృష్ణకు గుండెపోటు వచ్చింది. ఇవాళ ఉదయం వరకు బాగానే ఉన్న వంగవీటి రాధాకృష్ణ.. ఒకసారి గా కింద పడిపోయారు. ఛాతిలో నొప్పిగా ఉందని కుప్పకూలారు.. దీంతో వెంటనే చేరుకున్న కుటుంబ సభ్యులు... వంగవీటి రాధాకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించుకున్నారు.
 
దీంతో క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే టిడిపి నేత వంగవీటి రాధాను ఆసుపత్రికి తరలించారు. వెంటనే అంబులెన్స్ ను రప్పించిన కుటుంబ సభ్యులు... స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంగవీటి రాధాకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అయితే వైద్యం అం దించిన తర్వా త వంగవీటి రాధా ఆరోగ్యం పైన డాక్టర్లు కీలక ప్రకటన చేశారని సమాచారం. వంగవీటి రాధా ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్లు చెప్పార ట.
మరో 48 గంటలు.. వైద్యుల సమక్షంలోనే వంగవీటి రాధా ఉండాలని వారు సూచించారట. దీంతో కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే టిడిపి నేత వంగవీటి రాధాకృష్ణ ఆసుపత్రి పాలు కావడంతో... విజయవాడలో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడలో  వంగవీటి కుటుంబానికి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. వారందరూ ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా... మొన్నటి ఎన్నికల వరకు తటస్థంగా ఉన్న వంగవీటి రాధా.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ.. 2004 సంవత్సరంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి... విజయం సాధించడం జరిగింది. ఆ సమయంలో బిజెపి అభ్యర్థి పైన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం ప్రజారాజ్యం, వైసిపి పార్టీలు తిరిగి చివరికి మళ్ళీ...తెలుగుదేశం పార్టీలో చేరారు  వంగవీటి రాధాకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: