తిరుమలకు వెళ్తే చంపేస్తాం.. కాంట్రవర్షియల్ ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..??

praveen

బీజేపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న రాజా సింగ్ తాజాగా ఒక డెత్ వార్నింగ్ జారీ చేశారు. తిరుమల లడ్డూ పవిత్రత గురించి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి లడ్డూను అపవిత్రం చేసిన వారు అక్కడికి వెళ్లొద్దని అన్నారు. అలా కాదని వాళ్లు తిరుమల వెళితే హిందువులందరం ఏకమై వారిని చంపేస్తామని సీరియస్ వారిని ఇచ్చారు. హిందువుల మనోభావాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని రాజా సింగ్ నొక్కి చెప్పారు. హిందువులను చులకన చేసి, తప్పుగా మాట్లాడితే వారి నాలుక చీల్చుతానని కూడా తనదైన శైలిలో హెచ్చరించారు.
తిరుమల లడ్డూ ప్రసాదం ఎవరు కల్తీ చేశారనేది తెలుసుకోవడానికి ఏపీ సర్కార్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని రాజా సింగ్ కోరారు. ఈ పని చేసిన వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిని పట్టుకోవాల్సిందిగా ఏపీ సర్కార్ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే సిట్‌తోపాటు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని రాజా సింగ్ సూచన చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ఆలయాలను నీచులు, దుర్మార్గుల నుంచి పరిరక్షించాల్సిన అవసరం ఉందని కామెంట్స్ చేశారు. దేవదాయ ధర్మదాయ శాఖకు చెందిన భూములను కాపాడాలని అన్నారు. లేదంటే వాటిని అక్రమార్కులు కబ్జా చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని గుర్తు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద అన్య మతస్తుల ఉండకూడదని, వారు అక్కడ తిరగడం ఆందోళన రేకెత్తిస్తోందని అన్నారు. తిరుపతితోపాటు శ్రీశైలంలో కూడా అన్య మతస్తుల ఉన్నట్లుగా తనకు సమాచారం అందిందని పేర్కొన్నారు. వీళ్లు మత మార్పిడి కార్యక్రమాలు కూడా చేసే ప్రమాదం ఉందని అన్నారు. మిగతా చోట్ల అన్య మతస్తులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నారని కామెంట్స్ చేశారు. డబ్బులు, ఇతరత్రా ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పి హిందువులను వేరే మతాల్లోకి మార్చుతున్నారని కూడా ఆరోపణలు చేశారు. మతం మారిన హిందువులలో బలహీన వర్గాలే ఎక్కువ మంది ఉన్నారని గుర్తుచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: