సంతోష్‌ను దూరం పెట్టేసిన కేసీఆర్‌... ఫామ్‌హౌస్‌లోకి రావొద్ద‌ని చెప్పేశారా..?

RAMAKRISHNA S.S.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ హవా ఒక రేంజ్ లో ఉండేది. కేసీఆర్ను ఎవరైనా కలవాలంటే ముందుగా ఈయన పర్మిషన్ తప్పనిసరి. మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్యేలు - అధికార పార్టీ నేతలు - పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే ముందుగా సంతోషం ప్రసన్నం చేసుకోవాల్సి ఉండేది. అలా పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు అన్నీ తానై నడిపించిన సంతోష్ ఇప్పుడు ఎక్కడున్నారనే చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా సంతోష్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. రెండు దశాబ్దాల పాటు కేసీఆర్ కు నీడలా ఉన్న సంతోష్ ఇప్పుడు ఎందుకు అంటీ ముట్టినట్టు ఉంటున్నారు .. కేసీఆర్ కావాలనే దూరం పెట్టారా గతంలో ఉన్నత సానిహిత్యం ఇప్పుడు ఎందుకు తగ్గింది పార్టీ కార్యక్రమాల్లో సంతోష్ ఎందుకు స్పందించడం లేదు .. కవిత అరెస్టు తాజాగా హైదరాబాద్ పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న ఎందుకు మాట్లాడటం లేదు అన్న‌ది బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌.

పైగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ యాక్టివిటీస్కు పరిమితం కావటం ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చక్కెరలు కొడుతున్నాయి. తెలంగాణ‌ రాష్ట్ర రాజకీయాల శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ - బిజెపిలను గులాబీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా హైడ్రా ఉదంతం కొనసాగుతున్న సంతోష్ నాకు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కవిత అరెస్టు విషయంలో సంతోషం స్పందన ఏమాత్రం లేదు. కవిత అరెస్టు పరిణామం కవిత - కేటీఆర్ ను దగ్గర సంతోష్ తో మాత్రం ఈ ఇద్దరికీ బాగా గ్యాప్ పెరిగిందని చెప్తున్నారు. మన వైపు కవిత - కేటీఆర్ - హరీష్ మధ్య సంబంధాలు దెబ్బతిసేందుకు సంతోష్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్లాన్ చేశారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో ఉంది. ఇక 10 ఏళ్లపాటు కేసీఆర్ను సొంత పార్టీ నేతలు కలవకుండా సంతోష్ అడ్డంపడి అంతిమంగా పార్టీ ఓట‌మి కి కారణమయ్యారని నేతలు కేసిఆర్ కు ఫిర్యాదు చేశారట. ఇవన్నీ చూసి న కేసీఆర్ ఇప్పుడు సంతోషం పూర్తిగా దూరం పెట్టేసారని ఫామ్ హౌస్ లోకి కూడా ఆయనకు ఎంట్రీ లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: